Telangana Decade Celebrations: ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణలో పాలన : కేసీఆర్

Telangana Decade Celebrations: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు.

ABP Desam Last Updated: 02 Jun 2023 10:51 AM
ధ్వంసమైన రంగాలను పునరుద్దరించేందుకు నిజాయితీగా కృషి చేశాం: కేసీఆర్

ఉద్యమ సమయంలోనే కాదు పాలన కాలంలో కూడా ప్రజలు చాలా సహకరించారన్నారు కేసీఆర్. తెలంగాణ సమాజం ఆరు దశాబ్ధాలు పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించుకుందన్నారు. తెలంగాణ వచ్చే నాటికి అన్ని రంగాల్లోనూ విధ్వంసం కనిపించిందన్నారు. వాటిన్నింటిని అదిగమించి దేశంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందన్నారు. ధ్వంసమైన రంగాలను చక్కదిద్ది వాటిని ప్రగతి పథంలోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం నిజాయితీగా శ్రమించిందన్నారు. 

దేశం నివ్వెరపోయేలా తెలంగాణ ప్రగతి: కేసీఆర్

ప్రతి రంగంలో దేశం నివ్వెరపోయే ఫలితాలు సాధించి ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు సీఎం. అందుకే తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను స్మరించుకోవడానికి 22 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణలో పాలన : కేసీఆర్

స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు నమస్కరించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పాలన సాగిస్తుందన్నారు. 

అమరులకు నివాళితో దశాబ్ధి వేడుకలు ప్రాంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి వేడుకల ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమర వీరులకు సీఎం కేసీఆర్‌ నివాళి అర్పించారు. అక్కడ పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సచివాలయానికి చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు.

అమరులకు నివాళితో దశాబ్ధి వేడుకలు ప్రాంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి వేడుకల ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమర వీరులకు సీఎం కేసీఆర్‌ నివాళి అర్పించారు. అక్కడ పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సచివాలయానికి చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. 

తెలంగాణ అభివృద్ధిలో సిరిసిల్లది ప్రత్యేక పాత్ర

తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని వేరే రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉమ్మడి పాలకులు కేటాయించిన నిధుల కంటే ఇరవై రెట్లు కేటాయిస్తున్నాం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టు, రైతు వేదికలు, ఇలా లెక్కకు మించిన సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చారు. దుక్కి దున్నినప్పటి నుంచి విత్తనం కొనుగోలు వరకు అండగా ఉంటున్నారు. - కేటీఆర్

సిరిసిల్లలో దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఆచరిస్తుంది... దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతోంది. అన్నింటిని తట్టుకొని బలియమైన శక్తిగా ఎదుగుతోంది. సంక్షోభ సమయంలో ఆర్థిక నిర్వహణ చేస్తూ భారీ సంక్షేమ, ఆర్థిక కార్యక్రమాలు చేపట్టడం తెలంగాణకే సాధ్యమైంది. అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నాం. రాజన్న సిరిసిల్ల తనకంటు ప్రత్యేకత చాటుకుంటూ అభివృద్ధి సాధిస్తోంది. 

డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పర్సనల్ విభాగం ఐ.జి. కమలాసన్ రెడ్డి నేడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  కార్యాలయం లోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు 

Background

Telangana Decade Celebrations: ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ పదో ఏట అడుగుపెడుతున్న వేళ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. బీజేపీ ఈసారి గోల్కొండ కోటపై జెండా ఎగరేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహిస్తోంది. ఉదయం 7 గంటలకు మొదలైన సంబురాలు రాత్రి 9 గంటల వరకు సాగనున్నాయి. 


మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 21 రోజలపాటు సంబరాలు అంబరాన్ని అంటబోతున్నాయి. సచివాలయంలో ఉత్సవాలను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం ప్రజలను ఉద్దశించి కీలక ప్రసంగం చేయనున్నారు. ఎందరో అమరుల త్యాగల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఎలా మారిందో వివరించనున్నారు. 


స్వరాష్ట్ర పాలనలో సాధించి విజయాలు, ప్రగతి పంథాను రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో 21 రోజుల పాటు సంబురాలు జరగనున్నాయి. వ్యవసాయం, విద్యుత్తు, వైద్యం, విద్య, పరిశ్రమల అన్ని రంగాల్లో సాగిస్తున్న ప్రగతి, సాధించిన విజయాలను వివరించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో కాన్సెప్టుతో సమావేశాలు పెట్టనున్నారు. 


కొత్తగా నిర్మించిన సచివాలయంలో సీఎం కేసీఆర్ దశాబ్ధి సెలబ్రేషన్స్‌ ప్రారంభిస్తారు. ఉదయం పదిన్నరకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సంబురాలకు శ్రీకారం చుడతారు. తర్వాత తెలంగాణ అమరవీరుపలకు నివాళి అర్పిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 


జూన్‌ 3 రేపు తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్‌ 4: పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు. జూన్‌ 5: తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం జరుపుతారు. విద్యుత్‌ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. జూన్‌ 6: తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుగుతుంది. 


జూన్‌ 7: సాగునీటి దినోత్సవం నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ సభలు ఉంటాయి. రవీంద్ర భారతిలో ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు.


జూన్‌ 8: ఊరూరా చెరువుల పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. గోరేటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్య కారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. సహపంక్తి భోజనాలు చేస్తారు.


జూన్‌ 9: తెలంగాణ సంక్షేమ సంబురాలు జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరుపుతారు. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తారు.


జూన్‌ 10: తెలంగాణ సుపరిపాలన దినోత్సవం జరుపుతారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు- చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు.


జూన్‌ 11: తెలంగాణ సాహిత్య దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఉంటు-ంది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీ-లు నిర్వహించి, బహుమతులందజేస్తారు.


జూన్‌ 12: తెలంగాణ రన్‌ నిర్వహిస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్‌ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.


జూన్‌ 13: తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటు-న్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు.


జూన్‌ 14: తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించిన సమాచారాన్ని, సందేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందజేస్తారు.


జూన్‌ 15: తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం జరుపుతారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే కార్యక్రమాలుంటాయి.


జూన్‌ 16: తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్‌, మున్సిపాలిటీ-లు, పట్టణాలు సాధించిన ప్రగతిని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలుంటాయి.


జూన్‌ 17: తెలంగాణ గిరిజనోత్సవం జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తారు.


జూన్‌ 18: తెలంగాణ మంచి నీళ్ల పండుగ నిర్వహిస్తారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.


జూన్‌ 19: సోమవారం తెలంగాణ హరితోత్సవం ఉంటు-ంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.


జూన్‌ 20: తెలంగాణ విద్యాదినోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదేరోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు. అదే సందర్భంలో సిద్ధమైన 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ లను ప్రారంభిస్తారు.


జూన్‌ 21: తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, మత ప్రార్ధనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలుంటాయి.


జూన్‌ 22: అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.