Breaking News Live Telugu Updates: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నొవాక్ జకోవిచ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 29 Jan 2023 05:23 PM
తప్పిన పెను ప్రమాదం.. శ్రీశైలంలో లోయలో పడబోయిన బస్సు

తప్పిన పెను ప్రమాదం.. శ్రీశైలంలో లోయలో పడబోయిన బస్సు


శ్రీశైలం డ్యాం వద్ద ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది.


శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపు తప్పి గోడను బలంగా ఢీకొనింది. 


గోడకు ముందు ఇనుప రాడ్లను తగులుకొని బస్సు నిలిచిపోయింది.


 లేదంటే భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేది.

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నొవాక్ జకోవిచ్

ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ నిలిచాడు. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి సిట్సిపాస్ పై 6-3, 7-6 (7-4),  7-6 (7-5) తేడాతో జకోవిచ్ గెలుపొందాడు. ఇది అతడి కెరీర్ లో 10వ గ్రాండ్ స్లామ్ టైటిల్. కాగా, అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ రికార్డును సమం చేశాడు.






 

Manchu Manoj: తారకరత్నను చూసేందుకు వెళ్లనున్న మంచు మనోజ్

ఈ రోజు మధ్యాహ్నం 3:30కి నందమూరి తారకరత్నని చూడటానికి బెంగళూరు హాస్పిటల్ కి హీరో మంచు మనోజ్ వెళ్లనున్నారు.

BRS Meeting: కాసేపట్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ప్రగతి భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ ఎంపీలు చేరుకున్నారు. లంచ్ కార్యక్రమం అనంతరం, మరి కాసేపట్లో, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభంకానుంది. 

Odisha Minister: ఒడిశా మంత్రిపై దుండగుల కాల్పులు

ఒడిశాకు చెందిన ఓ మంత్రిపై దుండగులు తుపాకీ కాల్పులు చేయడం కలకలం రేపింది. నవ కిషోర్ దాస్ ప్రస్తుతం ఆరోగ్యమంత్రిగా ఉన్నారు. బ్రెజిరా నగర్ లోని గాంధీ చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. తీవ్రమైన గాయాలపాలైన మంత్రిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

TDP Leader Bachula Arjunudu: టీడీపీ నేత బచ్చుల అర్జునుడుకు గుండెపోటు

టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో ప్రత్యేక వైద్య బృందం బచ్చులకు స్టంట్ వేసి చికిత్స అందిస్తోంది. బీపీ ఎక్కువగా ఉన్నందున అర్జునుడి ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్లర్టు చెబుతున్నారు.

Hyderabad Accident: జూబ్లీహిల్స్‌లో కారు భీభత్సం, పరారైన యువతులు

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరు యువకులు డివైడర్ ను ఢీకొన్నారు. దీంతో కారులో ఉన్న యువతులు రోడ్డుపైనే కారు వదిలి పరారయ్యారు. కారు దూసుకువస్తుండటంతో జనం భయంతో పరుగులు తీశారు. కారు ఫిల్మ్ నగర్ వైపు నుంచి చెక్ పోస్ట్ వైపునకు వస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 65కు వెళ్లే రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tarakaratna Health News: తారకరత్నను చూసేందుకు బెంగళూరుకు బయల్దేరిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

బెంగళూరులో చికిత్స పొందుతున్న సినీనటుడు నందమూరి తారకరత్నను పరామర్శించేందుకు ఆదివారం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లనున్నారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకుని నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. ఇప్పటికే వారు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొన్నారు. ప్రస్తుతం తారకరత్నకు ఐసీయూలో ఆరేడుగురు కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స సాగుతోంది. నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరతో పాటు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అక్కడే ఉన్నారు.

Background

శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రం దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఆదివారం (జనవరి 29) నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. తర్వాత రెండు రోజుల్లో వాయుగుండంగా మారి శ్రీలంక తీరం దిశగా వెళ్లనుంది. దీని ప్రభావంతో ఈ నెల 30 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ అధికారులు తెలిపింది. 


ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణ ప్రాంతంలో తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు యానాం ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.


ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.


‘‘సరిగ్గా ఇప్పుడు బంగాళాఖాతంలో మాడన్ జూలియన్ ఆసిలేషన్ (దీని వలన వర్షాలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి) ప్రభావం ఉంది. ఆ మాడన్ జూలియన్ ఆసిలేషన్ వలన దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ గాలులు కూడ బలంగా ఉంది. అంటే కింద ఎక్కడో ఉన్న అల్పపీడనం శ్రీలంక వైపుగా రానుంది. దీని వలన మనకు ప్రభావం అంతగా ఉండదు కానీ తేలికపాటి వర్షాలు, ముసురు వర్షాలు ఈ వచ్చే సోమవారం నాడు (జనవరి 30) మనం చూడగలం. దక్షిణాది జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య​, కడప జిల్లాలో తేలికపాటి వర్షాలుంటాయి. ఒకటి, రెండు చోట్ల మాత్రమే కొంచం సేపు గట్టిగా వర్షాలుంటాయి.



ప్రకాశం, నంద్యాల​, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్లల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు ఉండవు. దీంతో ఎండాకాలానికి వాతావరణం సిద్దమవ్వనుంది. వెదర్ మాడల్స్ అంచనాల ప్రకారం ఈ సారి ఎండలు కాస్త ఎక్కువగా ఉండనున్నాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


పశ్చిమ గాలుల ప్రభావం అంటే..
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘మనకు ఎలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో, అలాగే  హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడ భూమిలోనే అల్పపీడనాలు ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్ లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాము. అంటే చిన్నగా పశ్చిమ గాలులు అని అనవచ్చు. ఇది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం భాగా ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. నేటి నుంచి రాష్ట్రమంతా చలి సాధారణంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఎక్కడా ఎల్లో అలర్ట్ లు జారీ చేయలేదు. మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. కొన్ని చోట్ల పొగమంచు అధికంగా ఉంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 30.6 డిగ్రీలు, 15.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.