Unique Mutton Chutney Recipe : మటన్ ముక్కలతో పచ్చడిని చాలామంది తినే ఉంటారు. కానీ మటన్ చట్నీని ఎప్పుడైనా తిన్నారా? సింపుల్గా, టేస్టీగా చేసుకోగలిగే ఈ మటన్ చట్నీని మీరు రైస్, చపాతీలు, బిర్యానీలో కూడా కలిపి లాగించేయవచ్చు. మరి ఈ సరికొత్త, టేస్టీ మటన్ చట్నీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు మటన్ - 1/2 Kg టోమాటో - 1.5 Kgs వెజిటెబుల్ ఆయిల్ - 2 tbsp కశ్మీరి కారం - 1 tbsp కారం - 1.5 tbsp ఉప్పు - 1 tbsp పసుపు - 1tsp అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 tbsp పుదీనా - 10 ఆకులు కొత్తిమీర - చిన్నకట్ట నీళ్లు - 1.5 cups మసాలా పొడికోసం ధనియాలు - 50 గ్రాములు నువ్వులు - 10 గ్రాములు కాళోంజి - 20 గ్రాములు చట్నీ కోసం నూనె - 500ml వెల్లుల్లి - 25-30 రెబ్బలు జీలకర్ర - 1 tsp ఆవాలు - 1 tsp ఎండు మిర్చి - 12 కరివేపాకు - గుప్పెడు నిమ్మరసం - 10-12 lemons తయారీ విధానం మటన్ బోన్ లెస్ తీసుకోవాలి. లేదా ఉడికించిన తర్వాత బోన్స్ తీసేయాలి. ముందుగా మటన్ని శుభ్రం చేసుకుని.. దాని ప్రెజర్ కుక్కర్లో వేయాలి. దానిలో టమోటో ముక్కలు, నూనె, కశ్మీరి కారం, కారం, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి.. అన్ని కలిసేలా పిసుకుతూ కలపాలి. అన్ని బాగా కలిసిన తర్వాత దానిలో ఒకటిన్నర కప్పుల నీళ్లు వేసి స్టౌవ్ వెలిగించి దానిపై పెట్టాలి. ఇది నాలుగు విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చిన తర్వాత.. మూత తీసేసి.. మీడియం మంటమీద కుక్కర్ని స్టౌవ్ మీద ఉడికించాలి. నీరు ఆవిరై.. దగ్గరగా అవుతున్నప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిని పూర్తిగా చల్లారనివ్వాలి. మటన్ చల్లారేలోపు.. స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టాలి. దానిలో ధనియాలు, నువ్వులు, కాళోంజి సీడ్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. వాటిని చల్లారనివ్వాలి. అనంతరం దానిని పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు మటన్ చల్లారిందో లేదో చెక్ చేసుకుని.. దానిని పేస్ట్ చేసుకోవాలి. అవును.. మటన్ మిశ్రమాన్ని రోట్లో లేదా మిక్సీలో వేసి పేస్ట్గా చేసుకోవాలి. ఇలా చేసే సమయంలో బోన్స్ లేకుండా ఉండేలా చూసుకోండి. ఎలా చేసినా పేస్ట్గా అయ్యేలా మాత్రం చేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పెద్ద కడాయి పెట్టుకోవాలి. దానిలో 500 ml నూనె వేసి.. కాగనివ్వాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అవి వేగిన తర్వాత దానిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అన్ని వేగిన తర్వాత.. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మటన్ పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. మటన్ని దానిలో ఉడకనివ్వాలి. ఎంతగా అంటే.. మటన్ పేస్ట్ పూర్తిగా ఆయిల్ని పీల్చుకుని.. మంచి కలర్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. మటన్ పేస్ట్ నూనెలో ఉడికే సమయంలో దానిని బాగా తిప్పుతూ ఉండండి. లేదంటే చట్నీ అడుగు పట్టేసే అవకాశముంది. దీనికి కనీసం 20 నుంచి 30 నిమిషాలు సమయం పడుతుంది. ఇప్పుడు దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఇది వేసిన తర్వాత మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు.. నిమ్మకాయలను కట్ చేసి.. ఫ్రెష్ జ్యూస్ తీసుకోవాలి. గింజలు లేకుండా నిమ్మరసాన్ని తీసుకోవాలి. మటన్ పేస్ట్, ధనియాల పొడి మిశ్రమం ఉడికిన తర్వాత నిమ్మరసాన్ని వేసి కలిపేయాలి. మటన్లో నిమ్మరసం పూర్తిగా కలిసేలా కలిపి.. స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ చట్నీ రెడీ. దీనిని మీరు రోటీల్లో, అన్నంలో, చపాతీల్లో ముఖ్యంగా బిర్యానీలో కూడా తినొచ్చు. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా డిఫరెంట్ స్టైల్లో టేస్టీగా ఆకట్టుకుంటుంది. Also Read : ఎన్టీఆర్ స్టైల్ మటన్ పలావ్.. సండే స్పెషల్గా హీరో రెసిపీని ఫాలో అయిపోండి