'లాల్‌ సలాం' డిజాస్టర్‌ - నాన్నవల్లే సినిమా ప్లాఫ్‌ అయ్యింది! ఐశ్వర్య షాకింగ్‌ కామెంట్స్‌
‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. హిందూ, ముస్లిం ఐక్యత, క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్వకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన  ఈ సినిమాలో రజనీ కీలక పాత్ర చేశారు. దాంతో మూవీపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అలా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. రజనీ సినిమా అంటే తమిళనాట పండగ వాతావరణం కనిపిస్తుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


తమన్నా షాకింగ్‌ వీడియో - అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవలు, ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌
శివరాత్రి సందర్భంగా స్టార్‌ హీరోయిన్‌ తమన్నా శివుడు సేవలో లీనమైంది. ప్రతి ఏడాది ఇషా ఫౌండేషన్‌ శివరాత్రి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు సైతం హాజరై శివుడి సేవలో భాగమవుతున్నారు. అలాగే తమన్నా కూడా నిన్న ఇషా ఫౌండేషన్‌ నిర్వహించిన శివరాత్రి వేడుకలో పాల్గొంది. ఈ సందర్భంగా తమన్నా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్ని వడ్డించింది. భక్తులందరికి తమన్న స్వయంగా వడ్డించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమన్నా సిప్లిసిటీ చూసి ఫ్యాన్స్‌ అంతా ఆమెను కొనియాడుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘గామి’ ఫస్ట్ డే కలెక్షన్స్ - ప్రపంచవ్యాప్తంగా విశ్వక్ సినిమా ఎన్ని కోట్లు సాధించిందంటే?
ఈమధ్య కాలంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కంటెంట్ ఇస్తున్నాయి. ఈ విషయం చాలామంది మూవీ లవర్స్ సైతం ఒప్పుకుంటారు. సినిమాలను థియేటర్లకు వెళ్లి చూడాలంటే స్టార్ హీరోలు ఉండాలి, భారీ బడ్జెట్‌తో తెరకెక్కాలి లాంటి అంచనాలు ఈరోజుల్లో ఎక్కువశాతం ప్రేక్షకులకు లేవు. అదే విషయాన్ని మరోసారి ‘గామి’ నిరూపించింది. విశ్వక్ సేన్ లాంటి ఒక యంగ్ హీరోను అఘోరగా చూపిస్తూ.. అతి తక్కువ బడ్జెట్‌తో విజువల్ వండర్‌ను క్రియేట్ చేశాడు దర్శకుడు విధ్యాదర్. దీంతో సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా ‘గామి’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు బయటికొచ్చాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కొత్త వ్యాపారం మొదలు పెట్టిన మెగా హీరో, తల్లి పేరుతో నిర్మాణ సంస్థ
సినిమాల ద్వారా వచ్చిన డబ్బును సినీ నటులు రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు రియల్ ఎస్టేట్ రంగంలో, మరికొంత మంది ఫుడ్ బిజినెస్ లో, ఇంకొంత మంది దుస్తులు, కాస్మోటిక్స్ రంగంలో డబ్బులు వెచ్చిస్తున్నారు. సినిమాలతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఇప్పటి వరకు సినిమాల్లో రాణించిన ఆయన ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ దుర్గ ప్రొడ‌క్ష‌న్స్‌ పేరిట సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


హిందీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన ‘హనుమాన్' - మరి తెలుగులో?
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’.. థియేటర్లలో ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా ఈరోజుల్లో థియేటర్లలో ఎంత బ్లాక్‌బస్టర్ అందుకున్న సినిమా అయినా.. నెలరోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. కానీ ‘హనుమాన్’ మాత్రం థియేటర్లలో విడుదలయ్యి దాదాపు రెండు నెలలు కావస్తోంది. అయినా ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కాలేదు. మార్చి 8న జీ5లో ‘హనుమాన్’ వచ్చేస్తుందని వార్తలు వినిపించాయి. దీంతో ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూశారు. జీ5లో ఈ సినిమా కనిపించకపోవడంతో ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. వాటికి జీ5 స్పందించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)