అప్ కమింగ్ తెలుగు మూవీస్ ఓవర్సీస్ రైట్స్ - ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయంటే?
తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా కీలకం. కోవిడ్ పాండమిక్ టైంలో మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ పుంజుకుంది. ఎప్పటిలాగే మన సినిమాకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. 'సలార్' మూవీ $ 8.9 మిలియన్లతో ఆల్-టైమ్‌ ఓవర్సీస్ హయ్యెస్ట్ గ్రాసర్ లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. అలానే 'హను-మాన్' 5 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి టాప్-10లో చోటు సంపాదించింది. ఇటీవల కాలంలో కొన్ని చిత్రాలు డొమెస్టిక్ మార్కెట్ కు ధీటుగా కలెక్షన్స్ రాబట్టాయి. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాల ఓవర్ సీస్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడి మరీ ఫ్యాన్సీ రేటుకు రైట్స్ కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న భారీ సినిమాల ఓవర్సీస్ హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయో ఇప్పుడు చూద్దాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సమంతకు మళ్లీ బ్రదర్‌గా టాలీవుడ్ హీరో - ఈసారి బాలీవుడ్‌లో
సమంత స్టార్ హీరోయిన్. సారీ సారీ... పాన్ ఇండియా హీరోయిన్. ఆమెతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు కోరుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఒక టాలీవుడ్ యంగ్ హీరోకి సమంతతో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే... ఆమెకు జోడీగా కాదు! ఆమెకు వరుసకు బ్రదర్ అయ్యే రోల్ చేశారు. మరోసారో అతడికి అటువంటి ఆఫర్ వచ్చిందని, ఈసారి బాలీవుడ్‌లో అని తెలిసింది. 'శాకుంతలం' సినిమా గుర్తు ఉందా? అందులో కీలక పాత్ర చేసిన యష్ పూరి గుర్తు ఉన్నారా? 'ఫ్యామిలీ మ్యాన్' వంటి సూపర్ డూపర్ హిట్ వెబ్ సిరీస్ తీసిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'. హిందీ హీరో వరుణ్ ధావన్, పాన్ ఇండియా స్టార్ సమంత అందులో ప్రధాన తారాగణం. ప్రజెంట్ దానికి డబ్బింగ్ చెప్పే పనిలో సామ్ బిజీగా ఉన్నారు. ఆ వెబ్ సిరీస్‌లో యష్ పూరి కూడా నటించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


వెంకటేష్ 'సైంధవ్' స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'సైంధవ్'. ఇది ఆయనకు చాలా స్పెషల్. ఎందుకు అంటే... ఆయన ప్రయాణంలో ఇదొక మైలురాయి. హీరోగా 75వ సినిమా. అందుకని, వెంకటేష్ ప్రచారంలో జోరుగా, హుషారుగా పాల్గొన్నారు. అయితే... వెంకీ & సినిమా యూనిట్ సభ్యులు ఆశించిన ఫలితం రాలేదు. కానీ, వెంకటేష్ నటనకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్లకు ఓ గుడ్ న్యూస్. అతి త్వరలో, ఈ వారం ఓటీటీలో 'సైంధవ్' స్ట్రీమింగ్ కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రీ రిలీజ్ కాబోతున్న పవన్ కళ్యాణ్ ప్లాప్ మూవీ - ఏపీ ఎన్నికలే టార్గెట్?
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైన వేళ ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతుండడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఓ సరైన డేట్ చూసి ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అలాంటి సినిమాలు చెయ్యను - ‘యానిమల్’పై తాప్సీ కామెంట్స్, రష్మికాను టార్గెట్ చేసుకుందా?
తాప్సీ పన్ను. ‘ఝుమ్మంది నాదం‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమలోనూ సత్తా చాటింది. నెమ్మదిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. అందం, అభినయంతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తాప్సీ పన్ను ‘యానిమల్‘ మూవీని టార్గెట్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)