నెల కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'గుంటూరు కారం' - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మొదటి ఆట నుంచి ఈ సినిమాకి డివైడ్ వచ్చింది కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాతో ఫుల్ ఎంజాయ్ చేశారు. సినిమాలో మహేష్ బాబు మాస్ క్యారెక్టరైజేషన్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి వసూళ్లు భారీగానే వస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బాక్సాఫీసు వద్ద 'హనుమాన్‌' దూకుడు - వారం రోజులైన తగ్గని కలెక్షన్ల జోరు, ఎంతంటే?
సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద సినిమాలు, అగ్ర హీరో సినిమాలను సైతం వెనక్కి నెట్టింది హనుమాన్‌ మూవీ. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, కుర్ర హీరో తేజ సజ్జ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఆడియన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు. సో సో అంచనాలతో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టింది. ఒక్క తెలుగులోనే కాదు విడుదలైన అన్ని భాషల్లోనూ పాజిటివ్ బజ్‌ క్రియేట్‌ చేసుకుంది. ఇక బాలీవుడ్‌లో అయితే ఊహించని రెస్పాన్స్‌తో రికార్డుల దిశగా పరుగులు తీస్తోంది. అక్కడ రోజురోజుకు థియేటర్లను పెంచుకుంటూ సర్‌పైజింగ్‌ కలెక్షన్స్‌ రాబడుతుంది. చూస్తుంటే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వరకు నార్త్‌లో హనుమాన్‌ హవా కొనసాగేలా కనిపిస్తోందంటున్నారు ట్రేడ్‌ వర్గాలు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అట్లీ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా - నిర్మాతగా త్రివిక్రమ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో పవన్ సినిమా షూటింగ్స్ సైతం పక్కన పెట్టి తన పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించారు. ఆమధ్య రాజకీయాలు, షూటింగ్స్ రెండిటికీ సమయం కేటాయించిన పవన్ ఇప్పుడు మాత్రం షూటింగ్స్ ని పూర్తిగా పక్కన పెట్టేసాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు.. వంటి వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. ఈ మూడు సినిమాలు ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. పవన్ ఖాతాలో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు వర్క్ చేరింది. ఈ క్రేజీ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అట్లీ - పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో లో ఓ సినిమా తెరకెక్కబోతోందట. ఈ ప్రాజెక్టుకి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రౌడీ హీరో సినిమా నుండి శ్రీలీల అవుట్ - ఆమె స్థానంలో మరో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు?
లైగర్ డిజాస్టర్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ సాలిడ్ సక్సెస్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది వచ్చిన 'ఖుషి' ఆ రేంజ్ సక్సెస్ ని అందించలేకపోయింది. ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదనిపించింది. కానీ రౌడీ హీరో నుండి ఫ్యాన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ ఆశిస్తున్నారు. అందుకే ఈసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఒకటి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘సరిపోదా శనివారం’ తెలుగు రాష్ట్రాల హక్కులు వారికే - అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు!
‘హాయ్ నాన్న’ సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కూతురు సెంటిమెంట్ తో నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ మూవీ హిట్ జోష్ లో ఉన్న నాని, ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ మూవీ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. సరిపోదా శనివారం’ సినిమాకు సంబంధించి కీలక విషయం బయటకు వచ్చింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)