సితార చేతికి మమ్ముట్టి 'భ్రమయుగం' - తెలుగులో ఆ రోజే విడుదల
లెజెండరీ యాక్టర్, మన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'భ్రమయుగం'. ఇదొక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాటులో రూపొందించారు. ఆల్రెడీ మలయాళ భాషలో విడుదలైంది. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణతో భారీ వసూళ్లు సాధిస్తోంది. త్వరలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్‌ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించిన 'భ్రమయుగం' సినిమాను తెలుగులో ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


యువ దర్శకుడికి అవకాశం ఇస్తున్న బాలకృష్ణ - నానికి హిట్ ఇచ్చినోడితో?
తెలుగు చలన చిత్రసీమలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను దర్శకుల హీరో అంటారు. కథ నచ్చితే చాలు... కొత్త దర్శకులతో సినిమా చేయడానికి ఆయన రెడీ అంటారు. యువ దర్శకులతో పలు సినిమాలు చేసిన ఘనత ఆయన సొంతం. కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన అనుభవం ఉన్న దర్శకుడితో ఆయన సినిమా చేయనున్నారని టాక్. 'శ్యామ్ సింగ రాయ్' డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖబర్. ఫిల్మ్ నగర్ వర్గాల కథనం ప్రకారం... ఇటీవల బాలకృష్ణను కలిసి రాహుల్ సాంకృత్యాన్ ఓ స్టోరీ ఐడియా చెప్పారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘యానిమల్’ను తెలుగులో తీస్తే.. ఆ హీరోయే కరెక్ట్: ఆర్జీవీ
'వ్యూహం' సినిమా ప్ర‌మోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. దాంట్లో భాగంగా అంద‌రికీ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు ఆయ‌న‌. అనుకున్న‌ది అనుకున్న‌ట్లు, చెప్పాలి అనిపించింది నిర్మొహ‌మాటంగా చెప్పేస్తారు ఆర్జీవి. అలా 'యానిమ‌ల్' సినిమా గురించి ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు ఆయ‌న‌. 'యానిమ‌ల్' సినిమాలో తెలుగు హీరోగా ఎవ‌రుచేస్తే బాగుంటుందో త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఓటీటీలోకి 'లాల్ స‌లామ్' ఇంత తొంద‌ర‌గానా? స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డంటే?
ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'లాల్ స‌లామ్' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింద‌నే చెప్పాలి. అనుకున్నంత ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు ఈ సినిమాకి. దీంతో ఇప్పుడు తొంద‌ర‌గానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఫిబ్రవ‌రి 9న రిలీజైన ఈ సినిమా మార్చి మొద‌టి వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోందనే వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దీని రైట్స్‌ను కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కలెక్షన్స్ వసూళ్లలో ‘ఈగల్’ ఢమాల్ - రవితేజను వెంటాడుతోన్న ఫ్లాప్స్, నష్టం ఎంతంటే?
ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది ర‌వితేజ న‌టించిన 'ఈగ‌ల్' సినిమా. ఫ‌ిబ్ర‌వ‌రి 9న రిలీజైన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నిర్మాతలకుర నిరాశ మిగిల్చింది. భారీ న‌ష్టాలను తెచ్చిపెట్టింది. ర‌వితేజ కెరీర్‌లోనే ఈ సినిమా అతిపెద్ద డిజార్ట్‌గా నిలిచినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొద‌టి మూడు రోజులు క‌లెక్ష‌న్స్ కొంతమేర బాగానే ఉన్నాయి అనిపించినా.. ఆ త‌ర్వాత మాత్రం ఘోరంగా విఫ‌లమైంది 'ఈగల్'. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)