పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీకి ఆ టైటిలే కన్ఫార్మ్? ఫ్యాన్స్‌కు పండగే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాతో గత శుక్రవారం(జూలై 28) ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి తేజ తో కలిసి పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక 'బ్రో' షూటింగ్ పూర్తి చేసిన అనంతరం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే తన నెక్స్ట్ మూవీ 'OG' షూటింగ్ కోసం వచ్చేసారు. ప్రభాస్ తో 'సాహూ' వంటి యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. 'సాహో' తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న సుజీత్ ఈ సినిమా కోసం పవర్ఫుల్ స్టోరీని రెడీ చేసుకుని ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రజినీకాంత్ సినిమాలో నాని, కోలీవుడ్‌లోకి నేచురల్ స్టార్ ఎంట్రీ?
ఎవరైనా ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ చేసినా.. లేక ఇద్దరు కలిసి మల్టీ స్టారర్‌లో నటించినా.. ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరు. ఒకప్పుడు ఈ గెస్ట్ రోల్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ గత కొన్నేళ్లలో ఒక హీరో చిత్రంలో మరో హీరో గెస్ట్ రోల్ అనేది చాలావరకు తగ్గిపోయింది. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఎప్పటినుండో కొనసాగుతున్నా సౌత్ సినీ పరిశ్రమల్లో మాత్రం గెస్ట్ రోల్ కాన్సెప్ట్ మాత్రం అరుదుగానే కనిపిస్తుంటుంది. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా ఒక స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'దయా' రివ్యూ : జేడీ చక్రవర్తి నటించిన తొలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
జేడీ చక్రవర్తి కథానాయకుడిగా నటించిన వెబ్ సిరీస్ 'దయా'. దీంతో ఆయన ఓటీటీకి పరిచయం అవుతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. తెలుగులో తీసిన సిరీస్ ఇది. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ అనువదించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈషా రెబ్బా, రమ్యా నంబీసన్, విష్ణుప్రియ తదితరులు నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది? జేడీ చక్రవర్తి ఎలా చేశారు? పవన్ సాధినేని ఎలా తీశారు? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


లండన్‌లో మహేష్ బాబు బర్త్ డే వేడుకలు - జక్కన్న అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నారా?
దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. గత నెలలో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి లండన్ వెకేషన్ కు వెళ్లారు ప్రిన్స్. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. తాజా సమచారం ప్రకారం, మరో పది రోజుల పాటు మహేష్ బాబు లండన్ లోనే ఉండనున్నారు. ఆగస్టు 9న ఆయన 48వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో లండన్ లోనే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోబోతున్నారు. లండన్ నుంచి తిరిగి వచ్చాక ‘గుంటూరు కారం’ మూవీ షూటింగ్ మళ్లీ మొదలుకానుంది. ఈ సినిమా నిర్మాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి, వచ్చే సంక్రాంతి(2024)కి విడుదల చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'లెట్స్ గెట్ మ్యారీడ్' రివ్యూ : ఎంఎస్‌ ధోనీ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
భారతీయులు వినోదం కోసం ఎక్కువగా చూసేది రెండు! అందులో ఒకటి క్రికెట్ అయితే... మరొకటి సినిమా! క్రికెట్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు చిత్రసీమలో అడుగు పట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఆ సంస్థలో ధోని సతీమణి సాక్షీ సింగ్ ధోని నిర్మించిన మొదటి సినిమా 'ఎల్‌జిఎమ్'. హరీష్ కళ్యాణ్, 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా జంటగా నటించారు. నదియా, యోగిబాబు ఇతర తారాగణం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)