దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. గత నెలలో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి లండన్ వెకేషన్ కు వెళ్లారు ప్రిన్స్. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. తాజా సమచారం ప్రకారం, మరో పది రోజుల పాటు మహేష్ బాబు లండన్ లోనే ఉండనున్నారు. ఆగస్టు 9న ఆయన 48వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో లండన్ లోనే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోబోతున్నారు. లండన్ నుంచి తిరిగి వచ్చాక ‘గుంటూరు కారం’ మూవీ షూటింగ్ మళ్లీ మొదలుకానుంది. ఈ సినిమా నిర్మాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి, వచ్చే సంక్రాంతి(2024)కి విడుదల చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.  


దర్శకధీరుడి ప్లాన్ ఏంటి?


సూపర్‌స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు SS రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. #SSMB29 పేరుతో ఈ సినిమా పనులు కొనసాగుతున్నాయి. రాజమౌళి ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు బర్త్ డే దగ్గర పడుతుండటంతో రాజమౌళి ఏం ప్లాన్ చేయబోతున్నారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.


ప్రిన్స్ బర్త్ వేళ  #SSMB29 అధికారిక ప్రకటన?


విశ్వసనీయ సమాచారం ప్రకారం, మహేష్ బాబు పుట్టిన రోజున నాడు #SSMB29 మూవీకి సంబంధించిన మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ పోస్టర్ లో ప్రిన్స్ మహేష్ బాబు గతంలో ఎప్పుడూ కనిపించని లుక్ తో దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి తనతో సినిమా చేస్తున్న నటీనటుల పుట్టిన రోజు సందర్భంగా సరికొత్తగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రియేటివ్ మేధావి కొత్త ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి మహేష్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.


హనుమంతుడి పురాణం నుంచి ప్రేరణ పొంది, దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు పాత్రను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హీరో లక్షణాలు ఆంజనేయుడి లక్షణాలను ప్రతిబింబించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా కథా రచయిత  KV విజయేంద్ర ప్రసాద్, ‘RRR’ను తలదన్నేలా #SSMB29 ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. యాక్షన్, థ్రిల్లర్ డ్రామాతో నిండిన అడ్వెంచర్ మూవీగా రూపొందబోతున్నట్లు తెలిపారు. పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్‌లోని అత్యుత్తమ టెక్నీషియన్స్ తో కలిసి పనిచేయడానికి దర్శకుడు రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ  దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Read Also: సమంత ట్రీట్మెంట్‌కు స్టార్ హీరో సాయం? బాబోయ్! అంత డబ్బు ఇచ్చాడా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial