సోషల్ మీడియాకు శాశ్వతంగా దూరంగా ఉండాలని వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నిర్ణయించుకున్నారు. దీనికి అశ్లీల చిత్రాల కేసు కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో పోర్నోగ్రఫీ కేసులో ఆయన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత గానీ ఆయనకు బెయిల్ రాలేదు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అజ్ఞాతవాసం గడుపుతున్నారు. పబ్లిక్‌లోకి పెద్దగా రావడం లేదు. ఇప్పుడు పబ్లిక్ ఫ్లాట్‌ఫార్మ్స్‌కి కూడా పూర్తిగా దూరమయ్యారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్స్‌ను శాశ్వ‌తంగా డిలీట్ చేశారు రాజ్ కుంద్రా.


రాజ్ కుంద్రాపై అశ్లీల చిత్రాల కేసు నమోదు అయిన తర్వాత ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయనకు మద్దతుగా గేహనా వశిష్ఠ మాట్లాడగా... షెర్లిన్ చోప్రా వంటి వారు రాజ్ కుంద్రాతో పాటు ఆయన భార్య, ప్రముఖ హిందీ కథానాయిక శిల్పా శెట్టిపై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఒకరిపై మరొకరు పరువు నష్టం దావా కేసులతో కోర్టు మెట్లు ఎక్కారు. అది పక్కన పెడితే... రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులపై ప్రేక్షకుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. శిల్పా శెట్టి కొన్ని రోజులు షూటింగులకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత నుండి హాజరు అవుతున్నారనుకోండి.


ఇప్పుడు రాజ్ కుంద్రా సోషల్ మీడియాకు దూరం కావడం బాలీవుడ్ ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ట్రోలింగ్, ఇతర విమర్శలకు దూరంగా ఉండటం కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తొలుత అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి పేరు కూడా వినిపించింది. అయితే... ఆమె పాత్ర ఏమీ లేదని పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు.


Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!? 


Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?


Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!


Also Read: 'పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' రాజా విక్రమార్క ట్రైలర్..


Also Read: రీషూట్ మోడ్ లో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి