By: ABP Desam | Updated at : 19 Jul 2022 06:19 PM (IST)
Edited By: Ramakrishna Paladi
జీఎస్టీ ( Image Source : Getty )
GST Rates: కొన్ని వస్తువులను విడిగా అమ్మినప్పుడు జీఎస్టీ వర్తించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ధాన్యాలు, పప్పులు, పిండి, పెరుగు, బటర్ మిల్క్ను ప్యాక్ చేయకుండా విక్రయిస్తే 5 శాతం పన్ను ఉండదని స్పష్టం చేశారు. జీఎస్టీ మండలిలో ఒక్కరే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరని, అంతా కలిసి సమష్టిగా పన్ను రేట్లు నిర్ణయిస్తారని వరుస ట్వీట్లు చేశారు. కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
'ముందుగానే ప్యాక్ చేసిన, లేబుల్ వేసిన వస్తువులపై పన్ను వేయాలన్న నిర్ణయం జీఎస్టీ మండలి సమష్టిగా తీసుకుంది. ఏ ఒక్కరో తీసుకోలేదు. ఈ జాబితాలోని వస్తువులను ప్యాక్ చేయకుండా విక్రయిస్తే ఎలాంటి జీఎస్టీ వర్తించదు. మా చర్చలు ఎలా జరిగాయో, వాటి సారాంశం ఏమిటో ఈ 14 ట్వీట్లలో ఇస్తున్నాం' అని నిర్మల ట్వీట్ చేశారు.
Is this the first time such food articles are being taxed? No. States were collecting significant revenue from foodgrain in the pre-GST regime. Punjab alone collected more Rs 2,000 cr on food grain by way of purchase tax. UP collected Rs 700 cr. (2/14) pic.twitter.com/T5G6FZ6lv5
— Nirmala Sitharaman (@nsitharaman) July 19, 2022
'పప్పులు, ధాన్యాలు, పిండి సహా మరికొన్ని ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ మండలి 47వ సమావేశంలో నిర్ణయించింది. ప్రస్తుతం వ్యాపించిన సమాచారంలో అవాస్తవాలు ఉన్నాయి. ఆ ఆహార పదార్థాలపై పన్ను విధించడం ఇదే తొలిసారా? కానే కాదు. జీఎస్టీకి ముందూ ఇలాంటి వస్తువులపై రాష్ట్రాలు పన్నుల ద్వారా రాబడి పొందాయి. తిండి గింజలపై కొనుగోలు పన్ను ద్వారా పంజాబ్ ఒక్కటే రూ.2000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ రూ.700 కోట్లు రాబట్టింది. ఆహార పదార్థాలపై పంజాబ్ 5.5, మహారాష్ట్ర 6, చత్తీస్ గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, మణిపుర్ 5 శాతం మేర పన్ను వసూలు చేశాయి' అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.
'గతంలో రిజిస్టర్ చేసిన బ్రాండ్లపై జీఎస్టీ విధించాం. దీనిని కొందరు వ్యాపారస్తులు దుర్వినియోగం చేశారు. సవ్యంగా పన్నులు చెల్లిస్తున్నవారు అందరికీ ఒకేలా ఉండాలా మార్పులు చేయాలని కోరారు. వారి సూచనల మేరకే ప్యాకేజీ, లేబుల్ వేసిన ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధించాం. పన్ను ఎగవేతను రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బిహార్, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల అధికారులతో కూడిన బృందం గుర్తించింది. దుర్వినియోగం చేయకుండా నిబంధనలు మార్చాలని అనేక సమావేశాల్లో చర్చించాం' అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
It must also be noted that items specified below in the list, when sold loose, and not pre-packed or pre-labeled, will not attract any GST. (10/14) pic.twitter.com/NM69RbU13I
— Nirmala Sitharaman (@nsitharaman) July 19, 2022
జీఎస్టీ వర్తించని వస్తువులు
8th Pay Commission : ఎనిమిదో వేతన సంఘం ఛైర్పర్శన్గా నియమితులైన జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఎవరు?
8th Pay Commission: 8వ వేతన సంఘం వల్ల గ్రూప్-డి, వాచ్మెన్ జీతాలు ఎంత పెరుగుతాయి?
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్డేట్ వచ్చింది!
Gold Price Forecast:బంగారం ధర తగ్గుతుందా? పెరుగుతుందా? కొనేముందు నిపుణుల అభిప్రాయం తెలుసుకోండి!
Emergency Fund: అర్జంటుగా డబ్బులు కావాలంటే ఏం చేయాలి? పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ లలో ఏది సరైనది
Montha Cyclone Update: ఏపీ వ్యాప్తంగా సైక్లోన్ మొంథా ప్రభావం - పలు చోట్ల వర్షాలు గాలులు - అధికారయంత్రాంగం అప్రమత్తం !
UPSC aspirant murder case: ప్రేమికుడ్ని మాజీ లవర్స్తో కలిసి చంపేసిన కేసులో ట్విస్ట్ - వెబ్ సిరిస్ చూసే ప్లాన్ చేసింది !
Ravi Teja Sreeleela Dance : స్టేజ్పై రవితేజ, శ్రీలీల డ్యాన్స్ - సూర్య ముఖ్య అతిథిగా 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్
Fact Check: అమిత్ షా బీహార్ ఓటర్లను బెదిరించారని చెప్పే ABP న్యూస్ వైరల్ గ్రాఫిక్ ఫేక్ - ఇదిగో నిజం