search
×

ABP Explain: మొబైల్‌ రీఛార్జులు, టికెట్ల బుకింగ్స్‌పై 'కన్వీనియెన్స్‌' దోపిడీ! అయిష్టంతోనే చెల్లిస్తున్న కస్టమర్లు!

ABP Exclusive: మనలో చాలామంది ఆన్ లైన్ లావాదేవీలు చేస్తూనే ఉంటాం. ఇందుకు ఎంతో కొంత కన్వీనియెన్స్‌ ఫీజు చెల్లిస్తుంటాం. ఐదో, పదో అయితే ఫర్వాలేదు గానీ వందల్లో ఇస్తుంటే బాధేస్తోంది కదా!

FOLLOW US: 
Share:

ABP Explain: 

దేశం డిజిటల్‌ ఎకానమీ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. రోజూ కోట్ల సంఖ్యలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. మొబైల్‌ రీఛార్జుల నుంచి సినిమా, రైలు, విమాన టికెట్ల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారు. సౌకర్యవంతంగా ఉండటంతో కస్టమర్లు ఈ సేవలకు అలవాటు పడిపోయారు. తమ కన్వీనియెన్స్‌ను అడ్డుపెట్టుకొని కంపెనీలు భారీ స్థాయిలో కన్వీనియన్స్‌ ఫీజు గుంజుతున్నాయని వారు వాపోతున్నారు.

ఏంటీ బాదుడు!

ఆన్‌లైన్‌ సేవల కంపెనీలు మొదట్లో అన్నీ ఉచితంగానే ఇచ్చాయి. యూజర్‌ పెనెట్రేషన్‌ పెరగ్గానే కొద్ది మొత్తంలో రుసుములు వసూలు చేయడం ఆరంభించాయి. ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్లు అడుగుతున్నాయి. రెండేళ్లుగా తమ సేవలకు కన్వీనియెన్స్‌ ఫీజును తీసుకుంటున్నాయి. కొద్ది మొత్తంలో చెల్లించేందుకు రెడీగా ఉన్నా కనీవినీ ఎరగని రీతిలో డిమాండ్‌ చేస్తుండటంతో కస్టమర్లు చిరాకు పడుతున్నారు. ఉదాహరణకు మొబైల్‌ రీఛార్జులపై పేటీఎం రూ.1-6 వరకు వసూలు చేస్తోందని ఫిన్‌షాట్స్‌ రిపోర్ట్‌ చేసింది. సినిమా టికెట్లపై బుక్‌మై షో ఏకంగా రూ.15-30 వరకు తీసుకుంటోంది. విమాన టికెట్లపై విస్టారా రూ.300-600 వరకు కన్వీనియెన్స్‌ ఫీజు దండుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌సీటీసీ ఇందుకేమీ మినహాయింపు కాదు. నిజం చెప్పాలంటే 2020-21లో కన్వీనియెన్స్‌ ఫీజు ద్వారానే రూ.299 కోట్లు ఆర్జించింది.

నియంత్రణ అవసరం!

టెక్నాలజీ ఖర్చుల కోసం కన్వీనియెన్స్‌ ఫీజు తీసుకోవాల్సి వస్తోందని కంపెనీ మాట! మెరుగైన సేవలు అందించేందుకు ఇది తప్పదని పేర్కొంటున్నాయి. వీటిపై నియంత్రణ లేకుంటే స్థాయికి మించి వసూలు చేస్తాయని కస్టమర్లు ఆందోళన చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే నగదు రహిత వ్యవస్థ నుంచి దారిమళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల కోసం ఎక్కువ కన్వీనియెన్స్‌ ఫీజు చెల్లించాల్సి వస్తోందని ప్రతి నలుగురులో ముగ్గురు వినియోగదారులు అంటున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలపై కంపెనీలు ఎక్కువ కన్వీనియెన్స్‌ ఫీజు డిమాండ్‌ చేస్తున్నాయని లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో 77 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇష్టం లేకుండానే!

తమకు ఇష్టం లేకున్నా కన్వీనియెన్స్‌ ఫీజు చెల్లించక తప్పడం లేదని 75 శాతం మంది తెలిపారు. ఏటా ఈ భారం అధికమవుతోందని చెప్పారు. తాము ఎలాంటి ఫీజు తీసుకోబోమని 2019లో పేటీఎం చెప్పినప్పటికీ కొన్ని రోజులుగా రూ.100 రీఛార్జులపై కన్వీనియెన్స్‌ ఫీజు వసూలు చేస్తోంది. ఫోన్‌పే గత అక్టోబర్‌ నుంచే తీసుకుంటోంది. అధిక కన్వీనియెన్స్‌ ఫీజుల వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నగదు రహిత సమాజం పరివర్తన కష్టమవుతుందని సర్వే వెల్లడించింది. విమానాలు, రైల్లు రద్దైనప్పుడు కన్వీనియెన్స్‌ ఫీజు తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కొందరు సోషల్‌ మీడియాలో చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

Published at : 06 Jan 2023 12:27 PM (IST) Tags: Paytm Book My Show Consumers Digital payments ABP Exclusive convenience fees phone pay

ఇవి కూడా చూడండి

Latest Gold-Silver Prices Today: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్‌ ఛాన్స్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

Latest Gold-Silver Prices Today: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్‌ ఛాన్స్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

Gold-Silver Prices Today: అమాంతం దిగొచ్చిన గోల్డ్‌ రేట్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

Gold-Silver Prices Today: అమాంతం దిగొచ్చిన గోల్డ్‌ రేట్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

EPFO New Rule: వైద్య ఖర్చుల కోసం వెతుక్కోనక్కర్లేదు - ఈపీఎఫ్‌ కొత్త రూల్‌తో మరింత వెసులుబాటు

EPFO New Rule: వైద్య ఖర్చుల కోసం వెతుక్కోనక్కర్లేదు - ఈపీఎఫ్‌ కొత్త రూల్‌తో మరింత వెసులుబాటు

ITR 2024: ఈ టిప్స్‌ ఫాలో అయితే టాక్స్‌ రిఫండ్‌ వేగంగా వస్తుంది - ఎక్కువ డబ్బు జమ అవుతుంది!

ITR 2024: ఈ టిప్స్‌ ఫాలో అయితే టాక్స్‌ రిఫండ్‌ వేగంగా వస్తుంది - ఎక్కువ డబ్బు జమ అవుతుంది!

Latest Gold-Silver Prices Today: భారీగా పడిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే!

Latest Gold-Silver Prices Today: భారీగా పడిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే!

టాప్ స్టోరీస్

IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌

IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌

KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ

Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్