search
×

ABP Explain: మొబైల్‌ రీఛార్జులు, టికెట్ల బుకింగ్స్‌పై 'కన్వీనియెన్స్‌' దోపిడీ! అయిష్టంతోనే చెల్లిస్తున్న కస్టమర్లు!

ABP Exclusive: మనలో చాలామంది ఆన్ లైన్ లావాదేవీలు చేస్తూనే ఉంటాం. ఇందుకు ఎంతో కొంత కన్వీనియెన్స్‌ ఫీజు చెల్లిస్తుంటాం. ఐదో, పదో అయితే ఫర్వాలేదు గానీ వందల్లో ఇస్తుంటే బాధేస్తోంది కదా!

FOLLOW US: 
Share:

ABP Explain: 

దేశం డిజిటల్‌ ఎకానమీ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. రోజూ కోట్ల సంఖ్యలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. మొబైల్‌ రీఛార్జుల నుంచి సినిమా, రైలు, విమాన టికెట్ల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారు. సౌకర్యవంతంగా ఉండటంతో కస్టమర్లు ఈ సేవలకు అలవాటు పడిపోయారు. తమ కన్వీనియెన్స్‌ను అడ్డుపెట్టుకొని కంపెనీలు భారీ స్థాయిలో కన్వీనియన్స్‌ ఫీజు గుంజుతున్నాయని వారు వాపోతున్నారు.

ఏంటీ బాదుడు!

ఆన్‌లైన్‌ సేవల కంపెనీలు మొదట్లో అన్నీ ఉచితంగానే ఇచ్చాయి. యూజర్‌ పెనెట్రేషన్‌ పెరగ్గానే కొద్ది మొత్తంలో రుసుములు వసూలు చేయడం ఆరంభించాయి. ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్లు అడుగుతున్నాయి. రెండేళ్లుగా తమ సేవలకు కన్వీనియెన్స్‌ ఫీజును తీసుకుంటున్నాయి. కొద్ది మొత్తంలో చెల్లించేందుకు రెడీగా ఉన్నా కనీవినీ ఎరగని రీతిలో డిమాండ్‌ చేస్తుండటంతో కస్టమర్లు చిరాకు పడుతున్నారు. ఉదాహరణకు మొబైల్‌ రీఛార్జులపై పేటీఎం రూ.1-6 వరకు వసూలు చేస్తోందని ఫిన్‌షాట్స్‌ రిపోర్ట్‌ చేసింది. సినిమా టికెట్లపై బుక్‌మై షో ఏకంగా రూ.15-30 వరకు తీసుకుంటోంది. విమాన టికెట్లపై విస్టారా రూ.300-600 వరకు కన్వీనియెన్స్‌ ఫీజు దండుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌సీటీసీ ఇందుకేమీ మినహాయింపు కాదు. నిజం చెప్పాలంటే 2020-21లో కన్వీనియెన్స్‌ ఫీజు ద్వారానే రూ.299 కోట్లు ఆర్జించింది.

నియంత్రణ అవసరం!

టెక్నాలజీ ఖర్చుల కోసం కన్వీనియెన్స్‌ ఫీజు తీసుకోవాల్సి వస్తోందని కంపెనీ మాట! మెరుగైన సేవలు అందించేందుకు ఇది తప్పదని పేర్కొంటున్నాయి. వీటిపై నియంత్రణ లేకుంటే స్థాయికి మించి వసూలు చేస్తాయని కస్టమర్లు ఆందోళన చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే నగదు రహిత వ్యవస్థ నుంచి దారిమళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల కోసం ఎక్కువ కన్వీనియెన్స్‌ ఫీజు చెల్లించాల్సి వస్తోందని ప్రతి నలుగురులో ముగ్గురు వినియోగదారులు అంటున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలపై కంపెనీలు ఎక్కువ కన్వీనియెన్స్‌ ఫీజు డిమాండ్‌ చేస్తున్నాయని లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో 77 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇష్టం లేకుండానే!

తమకు ఇష్టం లేకున్నా కన్వీనియెన్స్‌ ఫీజు చెల్లించక తప్పడం లేదని 75 శాతం మంది తెలిపారు. ఏటా ఈ భారం అధికమవుతోందని చెప్పారు. తాము ఎలాంటి ఫీజు తీసుకోబోమని 2019లో పేటీఎం చెప్పినప్పటికీ కొన్ని రోజులుగా రూ.100 రీఛార్జులపై కన్వీనియెన్స్‌ ఫీజు వసూలు చేస్తోంది. ఫోన్‌పే గత అక్టోబర్‌ నుంచే తీసుకుంటోంది. అధిక కన్వీనియెన్స్‌ ఫీజుల వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నగదు రహిత సమాజం పరివర్తన కష్టమవుతుందని సర్వే వెల్లడించింది. విమానాలు, రైల్లు రద్దైనప్పుడు కన్వీనియెన్స్‌ ఫీజు తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కొందరు సోషల్‌ మీడియాలో చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

Published at : 06 Jan 2023 12:27 PM (IST) Tags: Paytm Book My Show Consumers Digital payments ABP Exclusive convenience fees phone pay

ఇవి కూడా చూడండి

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

టాప్ స్టోరీస్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం