search
×

Stock Market Closing: 8 రోజుల లాభాలకు తెర! మళ్లీ 60K కిందకు సెన్సెక్స్‌!

Stock Market Closing Bell 19 August 2022: ఎనిమిది రోజుల వరుస లాభాలకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 19 August 2022: ఎనిమిది రోజుల వరుస లాభాలకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందకపోవడంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 198 పాయింట్ల నష్టంతో 17,758 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 651 పాయింట్ల లాభంతో 59,646 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు నష్టపోయి 79.78 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 60,298 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,351 వద్ద మొదలైంది. 59,474 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,411 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 651 పాయింట్ల నష్టంతో 59,646 వద్ద ముగిసింది.

NSE Nifty

గురువారం 17,956 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,966 వద్ద ఓపెనైంది. 17,710 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,992 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 198 పాయింట్ల నష్టంతో 17,758 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 39,732 వద్ద మొదలైంది. 38,848 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,759 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 670 పాయింట్ల నష్టంతో 38,985 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, ఎల్‌టీ, ఇన్ఫీ, బజాజ్‌ ఆటో, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టాటా కన్జూమర్స్‌, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్స్‌, మెటల్‌, ఫార్మా, రియాల్టీ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BSEIndia (@bseindia)

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 19 Aug 2022 03:57 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

టాప్ స్టోరీస్

Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.

Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.

Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్‌ వర్మ పేరు దాదాపు ఖరారు! 

Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్‌ వర్మ పేరు దాదాపు ఖరారు! 

Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ 

Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ