By: ABP Desam, Rama Krishna Paladi | Updated at : 12 Apr 2023 03:50 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 12 April 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఫార్మా, ఐటీ, బ్యాంకు షేర్ల గిరాకీతో సూచీలు ఎగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 90 పాయింట్లు పెరిగి 17,812 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 235 పాయింట్లు పెరిగి 60,392 వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 82.08 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,157 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 60,180 వద్ద మొదలైంది. 60,094 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,437 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 235 పాయింట్ల లాభంతో 60,392 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 17,722 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ బుధవారం 17,759 వద్ద ఓపెనైంది. 17,717 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,825 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 90 పాయింట్లు పెరిగి 17,812 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 41,426 వద్ద మొదలైంది. 41,332 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,610 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 191 పాయింట్లు పెరిగి 41,557 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐచర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సెమ్, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా, పీఎస్యూ బ్యాంక్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, హెల్త్కేర్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.61,310గా ఉంది. కిలో వెండి రూ.750 పెరిగి రూ.77,350 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.26,390 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
#MoneyMindedMalini Episode #2 is here.
— NSE India (@NSEIndia) April 3, 2023
Username and password are like your security guards, and SMS notifications are like CCTV cameras of your trading account. To know more watch this video.#SochKarSamajhKarInvestKar #InvestorAwareness #StockMarket@ashishchauhan… pic.twitter.com/97qlh7Qogc
Don't fall for unsolicited stock tips promising assured/guaranteed returns in stock market. Be a smart investor https://t.co/6EIJrMfdyF#unsolicitedstocktips #AssuredReturns #FixedReturns #GuaranteedReturns #StockMarket #InvestorAwareness #NSEIndia @ashishchauhan pic.twitter.com/lxatEwM2Jt
— NSE India (@NSEIndia) April 12, 2023
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
Telangana Ration Card Latest News: తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ఏ జిల్లాలో ప్రారంభిస్తారు? రాష్ట్రమంతటా ఎప్పుడు ఇస్తారు?