CM KCR చాలా అసహనంతో వ్యవహరిస్తున్నారు.. దుబ్బాక ఎమ్మెల్యే
ABP Desam
Updated at:
06 Oct 2021 11:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు లేనంతగా అసెంబ్లీలో చాలా అసహనంతో వ్యవహరిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనపై వెటకారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. దళితబంధు పథకాన్ని బీజెపీ స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. దళితబంధు పథకం నిర్ణయం మంచిదేనని, అయితే ఆచరణ తీరు గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. హామీ ఇచ్చినట్లుగా దళితులకు సీఎం కేసీఆర్ 3 ఎకరాలు ఇప్పటికీ ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. దళింతులందరికి పది లక్షలు రూపాయలు ఇచ్చే వరకు బీజెపీ పోరాటం చేస్తుందని చెప్పారు.