Huzurabad Bypoll: ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?

Continues below advertisement

హుజూరాబాద్ ఉపఎన్నికలలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. వెయ్యి నామినేషన్లు వేస్తామంటూ ఫీల్డ్ అసిస్టెంట్స్ చెప్పారు. కరోనా రూల్స్ వలన ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా వేయలేకపోయారు . కరోనా రూల్స్ పేరుతో అధికారులు అడ్డుకుంటున్నారని ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆరోపించారు . ఎనిమిదవ తేదీ కల్ల 600 నామినేషన్లు వేస్తున్నట్లు ఫీల్డ్ అసిస్టంట్ లు ప్రకటించారు . కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నట్టు తెలుస్తుంది. అభ్యర్థులకు స్థానికుల నుంచి మద్దతు లభించడం లేదు. ఒకవేళ ఆఫీసుకు వెళ్లినా.. వారికి ఏదో ఒక కారణం చెప్పి అధికారులు వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్‌కు ఓటు వేయవద్దని చెప్తాం అని ఫీల్డ్ అసిస్టెంట్స్ అంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram