Hardik Pandya : తనపై వచ్చిన ప్రచారం పై రియాక్టయిన అల్ రౌండర్
ABP Desam
Updated at:
16 Nov 2021 02:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీ20 వరల్డ్ కప్ ముగిసిన తరువాత ముంబైకి తిరొగొచ్చిన టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఎయిర్పోర్టులో చేదు అనుభవం ఎదరైందని, కోట్ల విలువైన వాచ్లను కస్టమ్స్ సీజ్ చేసిందని ప్రచారం జరిగింది. దీనిపై పాండ్యా స్పందిస్తూ.. ఖరీదైన వాచ్ల వ్యవహారంపై వచ్చినవి వదంతులేనని కొట్టిపారేశాడు. అతడి వద్ద ఉన్న కోట్ల రూపాయల వాచ్ లను ముంబై కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని, అతడి వద్ద రెండు ఖరీదైన వాచ్లున్నాయని వాటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని వైరల్ అయింది. జాతీయ మీడియాలో కథనాలు రాగా, ఆ కథనాలపై పాండ్యా వివరణ ఇచ్చాడు.