Revanth reddy: తెరాస సీనియర్ నేతలను ప్రశ్నించిన టి.పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
రాజ్యాంగాన్ని కాపాడుకుందామని,గాంధీ భవన్ లో ఎస్సి సెల్ చేపట్టిన 48 గంటల దీక్షను విరమింపజేసారు పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఎస్సి సెల్ చైర్మన్ ప్రీతం తో పాటు పలువురికి కి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు రేవంత్ రెడ్డి,ఎఐసిసి ఎస్సి సెల్ చైర్మన్ రాజీవ్ లిలోతియా తదితరులు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు,ఆ రాజ్యాంగం వల్లే కేసీఆర్ రెండు సార్లు తెలంగాణ కు సీఎం అయ్యారు.కేశవ రావు, కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలు అన్ని తెలిసి కేసీఆర్ కుర్చీ దగ్గర ఎందుకు వున్నారని ప్రశ్నించారు.