Notices to Telangana CS: సోమేశ్ కుమార్ కు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
ABP Desam
Updated at:
22 Jan 2022 03:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBJP తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు మేరపై తెలంగాణ CS, ముఖ్య కార్యదర్శికి లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. వీరితో పాటు DGP, కరీంనగర్ CP, ACP, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్స్పెక్టర్ లకు కూడా నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ పై పోలీసులు అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై ఇప్పటికే విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీ... సంజయ్ వాంగ్మూలాన్నీ నమోదు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు అధికారులకు నోటీసులు పంపింది.