Nellore Employees Rally : నెల్లూరు జిల్లాలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
ABP Desam
Updated at:
25 Jan 2022 04:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్ మోగింది. వచ్చే నెల ఆరోతేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన ఉద్యోగులు నేటినుంచి ఉద్యమ కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నెల్లూరులో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక గీతాలతో ఆకట్టుకున్నారు. నెల్లూరు రోడ్లన్నీ ఉద్యోగులతో నిండిపోయాయి. బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టుకుని ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. మహిళా ఉద్యోగులు కూడా ముందుకు కదిలారు. పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.