Konda Surekha: కొండా మురళి తల్లితండ్రుల స్మారక నిర్మాణాన్ని కూలగొట్టడం దారుణం.!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతరలోని కొండా మురళి తల్లిదండ్రుల విగ్రహాల స్మారక నిర్మాణాన్ని కూలగొట్టడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. తాను పరకాల ఎమ్మెల్యేగా, కొండా మురళి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే అగ్రంపహాడ్ లో మూడెకరాలకు పైగా స్థలాన్ని కొనుగోలు చేసి, ఆ ప్రాంత ప్రజల జాతర సౌకర్యార్థం ఉంచినట్లు తెలిపారు. అది దేవాదాయ శాఖకు అప్పగించలేదని, కూతురు సుస్మితా పటేల్ పేరు మీదనే తమ వద్ద కాగితాలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి గెలిచాక వాటి నుంచి విగ్రహాలను తొలగించాలని ప్రయత్నం చేశారన్నారు. గతంలోనూ ఇదే విధమైన ప్రయత్నం చేశారని, అప్పుడు కలెక్టర్ వాకాటి కరుణ వారించారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కావాలనే దేవాదాయ శాఖ అధికారులకు కూల్చేసే విధంగా ఆదేశాలిచ్చారని తెలిపారు.