East Godavari Old Lady : ఓటీఎస్ కట్టమని ఇంటికి వచ్చిన అధికారులపై మండిపడిన వృద్ధురాలు
ABP Desam
Updated at:
22 Jan 2022 05:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజానగరం మండలం తోకాడ గ్రామం లో ఓటీఎస్ డబ్బులు కట్టాలి అని అడిగిన అధికారులకు ఓ వృద్ధురాలు చుక్కలు చూపించింది. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం ఉచితంగా ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు ఎక్కడ తెచ్చి డబ్బులు కట్టాలి అని మండిపడింది. ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని ఉద్యోగాలు ఇతర పథకాలతో నాశనం చేస్తున్నారని మండిపడిన వృద్ధురాలు...ఊర్లో అందరూ కడితే తాను కడతానని లేదంటే లేదంటూ తెగేసి చెప్పింది. వృద్ధురాలి ఆగ్రహాన్ని అక్కడే ఉన్న కొంత మంది ప్రభుత్వ సిబ్బంది రికార్డు చేయగా...ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.