Corona vaccine: వ్యాక్సినేషన్లో చరిత్ర సృష్టించిన భారత్
ABP Desam
Updated at:
21 Oct 2021 10:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవ్యాక్సినేషన్లో భారత్ చరిత్ర లిఖించింది. వ్యాక్సినేషన్లో 100 కోట్ల డోసులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రత్యేక గీతాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు. దేశంలో కరోనా టీకా పంపిణీ శత కోటి డోసుల మార్క్ దాటడంపై శుభాకాంక్షలు తెలిపారు. దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. గతంలో ఒక్కరోజే 2.5 కోట్ల టీకాలు వేశారు. చైనా తరువాత వంద కోట్ల మార్కు దాటిన దేశంగా భారత్ నిలిచింది.