Tirumala Visit: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ భరత్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాజమండ్రి ఎంపీ మార్గాని భర్గత్ సోమవారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారికి వెండి సాలిగ్రామ హారాన్ని ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డికి అందజేశారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలియజేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారిని ఎంపీ మార్గాని భరత్ దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు. యావత్తు మానవాళిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. రాబోవు దేవీనవరాత్రుల్లో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగలను జరుపుకోవాలని కోరారు. వినాయక చవితికి సంబంధించి ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారన్నారు.