AP CM Jagan: ఆ పది అంశాలతోనే బడులు పునరుద్ధరణ.. పిల్లల భవిష్యత్ కోసమే బడులు తెరిచామన్న సీఎం జగన్
ABP Desam
Updated at:
16 Aug 2021 09:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూల్స్ కంటే ఉన్నతమైన విద్య అందించాలన్న ఉద్దేశంతోనే విద్యాసంస్కరణలు చేపట్టామన్నారు సీఎం జగన్. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో నాడునేడు బడులను విద్యార్థులకు అంకితమిచ్చారాయన. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యార్థుల కోసం చేపట్టిన ప్రభుత్వ పథకాలు వివరించారు. విద్యార్థుల మంచి భవిష్యత్ కోసం నాడు నేడుతో బడులు అభివృద్ధి చేశామన్నారు. రెండో విడత కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు. ఒకే రోజులు ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు సీఎం జగన్.