Pawan Kalyan: ఆమదాలవలస దాడిలో గాయపడిన జనసైనికులను ఫోన్ లో పరామర్శించిన పవన్ కల్యాణ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాష్ట్రంలోని రహదారుల అధ్వాన పరిస్థితిపై నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలు, నేతలు, మహిళలపై దాడులు చేయడం హేయమైన చర్యని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోలీసుల సమక్షంలో వైసీపీ నేతలు దాడులకు తెగబడుతుంటే ఆవేదన కలిగిస్తుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ నాయకుడు పేడాడ రామ్మోహనరావు ప్లెక్సీ ఏర్పాటుచేశారు. ఈ ఫ్లెక్సీపై తమ్మినేని సీతారాం ఫొటో ఉండడంపై పోలీసుల సమక్షంలో దాదాపు 25 మందికి పైగా అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దాడికి తెగబడ్డారని పవన్ విమర్శించారు. ఈ దాడిలో రామ్మోహన్రావుతోపాటు ఏడుగురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారని వెల్లడించారు. దాడిలో గాయపడిన వారిని ఫోన్ లో పవన్ కల్యాణ్ పరామర్శించారు.