విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా విజయవాడలోని కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో జస్టిస్ వెంకటరమణ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితులచే సీజేఐ దంపతులకు ఆశీర్వచనం చేశారు. తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని , తీర్ధప్రసాదాలను అందజేశారు.