Jr NTR Fans Hungama in Amit Shah Meeting | అమిత్‌ షా సభలో సీఎం ఎన్టీఆర్ నినాదాలు | ABP Desam

Continues below advertisement

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో జై ఎన్టీఆర్ అన్న నినాదాలు మారు మ్రోగాయి. ఎన్నికల వేళ అమిత్ షా, చంద్రబాబు పాల్గొన్న జూనియర్ ఫ్లెక్సీల ప్రదర్శన, ఎన్టీఆర్ సీఎం అంటూ చేసిన నినాదాలు సంచలనంగా మారాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ప్రదర్శన సంచలనం రేపుతోంది. ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరుఫున ఎన్నికల ప్రచారం కోసం అమిత్ షా వచ్చారు. ధర్మవరంలోని సిఎన్బి గార్డెన్స్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు అమిత్ షా తో పాటు చంద్రబాబు కూడా హాజరయ్యారు. అయితే టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తల కంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా ఎక్కువగా కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా ఉన్న ఫోటోలతో జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ సీఎం అంటూ ప్రదర్శన నిర్వహించారు. వారు ప్రదర్శించిన ప్లకార్డుల్లో ఎక్కడా చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణ ఫోటోలు లేవు. కేవలం సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. వారు సభలో జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram