Pawan Kalyan: జనసేన అభ్యర్థుల విజయంపై స్పందించిన పవన్ కల్యాణ్
ABP Desam
Updated at:
20 Sep 2021 05:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ బలమైన పోరాటం చేశారని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై జనసేనాని తాజాగా స్పందించారు. ఇప్పటి వరకు అధికారికంగా వచ్చిన ఫలితాల మేరకు 177 ఎంపీటీసీ, 2 జడ్పీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించినట్లు పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ తరఫున విజయం సాధించిన అభ్యర్థులందరికీ పవన్ అభినందనలు తెలిపారు. ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయో అనే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని పవన్ అన్నారు. ఫలితాలపై పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉందన్న ఆయన.. రెండు, మూడు సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తానని ఆయన పేర్కొన్నారు.