Chandrababu Naidu on YSRCP 11Seats: వైసీపికి 11 సీట్లే దక్కటం దేవుడి స్క్రిప్టు అన్న సీఎం చంద్రబాబు
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChandrababu Naidu on YSRCP 11Seats: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అన్నయ్యపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీకి 11 సీట్లే ఎందుకు వచ్చాయో వివరించారు.
స్పీకర్గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. సుమారు రెండున్నరేళ్లు తర్వాత సభలో మాట్లాడిన చంద్రబాబు కాస్త ఎమోషన్ అయ్యారు. అనాటి పరిస్థితులు మరోసారి గుర్తు చేశారు. తన ఫ్యామిలీపై అనవసరంగా ఎలాంటి కారణంలేకుండా నోరు పారేసుకున్నారని అన్నారు.
గత ప్రభుత్వం చేసిన దుశ్చర్యలను ఎండగడుతూనే అప్పట్లో జగన్ చేసిన కామెంట్స్ను గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు చంద్రబాబు. 2019లో తమ పార్టీకి 23 సీట్లు వస్తే బాధపడ్డామన్నారు. 23న ఎన్నికల ఫలితాలు వస్తే దాన్ని వక్రీకరించి ఇది దేవుడు రాసిన స్క్రిప్టు అని అందుకే 23 సీట్లు వచ్చాయని విమర్శలు చేశారు. ఇప్పుడ కూటమికి 164 సీట్లు వచ్చాయి. ఇవి కూడితే 11 అవుతుంది. అమరావతి రైతులు 1631 రోజులు ఉద్యమం చేసి అవి కూడినా 11 వస్తుంది. ఇది కూడా భగవంతుడు స్క్రిప్టేనా అంటూ తాము మాట్లాడబోమన్నారు. ఇలాంటి సభలో ఉండకపోవడం వారి పిరికితనంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఇవాళ చేసే పని రేపటి ప్రజల భవిష్యత్ను నిర్ణయిస్తుందన్నారు. అందుకే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కలతో అందరూ కలిసి పని చేయాలని సూచించారు. చేసే చట్టాలు కూడా పేదరికం లేదని ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుట్టాలని కోరుకున్నారు. అందుకే అయ్యన్న సహకరిస్తారని చెప్పుకొచ్చారు