Viral Video: ఇసుక అక్రమ రవాణా వ్యవహారం... మంత్రి ఫోన్ సంభాషణ వైరల్!
ABP Desam
Updated at:
07 Sep 2021 11:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం కలకలం రేపుతోంది. ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ ప్రజాప్రతినిధుల హస్తముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో ఓ మంత్రి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను విడిచిపెట్టాలని ఎస్సైతో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమ ఇసుక రవాణా వివాదంలో చిక్కుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను విడిచిపెట్టాలన ఓ ఎస్సైని బెదిరించారన్న ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణా నిజమేనని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.