Pawan Kalyan: ప్రజల సొమ్ముతో పెట్టే పథకాలకు సీఎంల పేర్లా?.. త్యాగధనులు కనిపించరా..? పంద్రాగస్టు స్పీచ్లో పవన్ పంచ్లు
ABP Desam
Updated at:
15 Aug 2021 01:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. దేశంలో ఉన్న పరిస్థితులు ఉటంకిస్తూనే.. తెలుగుదేశం, వైసీపీ నేతలపై పరోక్షంగా పంచ్లతో విరుచుకుపడ్డారు. ప్రజల సొమ్ముతో పథకాల పెట్టే ప్రభుత్వాలు.. వాటికి ముఖ్యమంత్రుల పేర్లు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అదే సమయంలో పార్టీ శ్రేణులకు కూడా పవన్ దిశానిర్దేశం చేశారు. దేశం ఫస్ట్ అని తర్వాతే జనసేన అని పవన్ పేర్కొన్నారు.