ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచుకు ముందు కపిల్‌దేవ్‌ టీమ్‌ఇండియాను హెచ్చరించాడు. ఒత్తిడిని జయించకపోతే పాకిస్థాన్‌ విజయం సాధించే అవకాశం ఉందని సూచించాడు. కోహ్లీసేన పేపర్‌పై పటిష్ఠంగానే కనిపిస్తున్నా మైదానంలోని పరిస్థితులే జయాపజయాలను నిర్ణయిస్తాయని వెల్లడించాడు. ఏబీపీ న్యూస్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడాడు.


ఆదివారం మైదానంలో ఏ జట్టు ఆధిపత్యం సాధిస్తుందని అడగ్గా.. 'మైదానంలో ఇవేవీ పనిచేయవు. రెండు జట్లు ఒత్తిడిలోనే ఉంటాయి. అందుకే ఒత్తిడిని ఎవరు జయిస్తారన్నది ఆసక్తికరం' అని కపిల్‌ అన్నాడు. 'పాకిస్థాన్‌ జట్టు గురించి నాకూ ఎక్కువేం తెలియదు. అయినప్పటికీ టీ20ల్లో వారు ప్రమాదకరమమని చెప్పగలను. తమదైన రోజున వారు ఎవర్నైనా ఓడించగలరు' అని ఆయన పేర్కొన్నాడు.






'పేపర్‌పై టీమ్‌ఇండియా బలంగా ఉంది. వారు లయ అందుకుంటారేమో చూడాలి. ఎందుకంటే వారు టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడబోతున్నారు' అని కపిల్‌ చెప్పాడు. పాక్ అనిశ్చితి గురించి గుర్తుచేయగా.. 'రెండు జట్లు ఒకరితో ఒకరు తలపడలేదు. అందుకే కచ్చితంగా అనిశ్చితి ఉంటుంది. భారత్‌ బలంగానే కనిపిస్తోంది. కానీ పాక్‌లో ఊహించని ఆటగాళ్లు ఉన్నారు. ఏదేమైనా భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని వెల్లడించాడు. ఒకవేళ ఒత్తిడిని తట్టుకోలేకపోతే మాత్రం టీమ్‌ఇండియాను పాక్‌ ఓడించగలదని అంచనా వేశాడు.



Also Read: T20 WC, BAN vs SL Preview: బంగ్లా పులులా? లంకేయులా? సూపర్‌ 12లో షాకిచ్చేదెవరు?


Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!


Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?


Also Read: Virat Kohli Pressmeet: మంటలో పెట్రోల్ పోయను.. మాట్లాడటానికేమీ లేదు.. ప్రెస్‌మీట్‌లో కోహ్లీ ఏమన్నాడంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి