క్రికెటర్లను కొవిడ్‌ మహమ్మారి వెంటాడుతూనే ఉంది. తాజాగా నలుగురు యువ క్రికెటర్లకు పాజిటివ్‌ వచ్చింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తలపడుతున్న ముంబయి ఆటగాళ్లకు కరోనా సోకడంతో వారి స్థానాల్లో ఇతరులను తీసుకున్నారు.


మంబయి మిడిలార్డర్‌లోని యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, బౌలర్‌ షామ్స్‌ ములాని, లెగ్‌ స్పిన్నర్‌ ప్రశాంత్‌ సోలంకి, ఆల్‌రౌండర్‌ సాయిరాజ్‌ పాటిల్‌కు కొవిడ్‌ సోకిందని పీటీఐ తెలిపింది. వారి బదులు మరో నలుగురిని ఎంపిక చేసినట్టు ముంబయి క్రికెట్‌ సంఘం పీటీఐకి తెలిపింది.


'ప్రత్యామ్నాయ ఆటగాళ్లకు ర్యాపిడ్‌ ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించాం. వారి రిపోర్టులు త్వరలోనే అందనున్నాయి. నెగెటివ్‌ వస్తే వెంటనే జట్టులో చేరతారు. జట్టులోని మిగతా ఆటగాళ్లకూ పరీక్షలు చేయిస్తున్నాం' అని పీటీఐకి ముంబయి వర్గాలు తెలిపాయి. ఈ నలుగురిలో సోలంకి ఇంకా టీ20ల్లో అరంగేట్రం చేయలేదు.


సర్ఫరాజ్‌ ఇప్పటికే 68 టీ20లు ఆడాడు. గతంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, తాజాగా పంజాబ్‌ కింగ్స్‌కు ఆడాడు. ములాని దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 24 టీ20ల అనుభవం ఉంది. టీమ్‌ఇండియాలో ఎంట్రీ కోసం సర్ఫరాజ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. కొవిడ్‌ రావడంతో అతడు కొన్ని రోజులు మ్యాచులకు దూరమవ్వక తప్పదు.


Also Read: AUS vs SL, Match Highlights: వార్నర్ భాయ్ ఈజ్ బ్యాక్.. శ్రీలంక‌ను చిత్తు చేసిన ఆసీస్


Also Read: Dinesh Karthik Update: దినేష్ కార్తీక్‌కు కవలలు.. క్రికెటర్ నాటీ రిప్లై.. ఏం పేర్లు పెట్టాడంటే?


Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీ మాటలు అస్సలు నచ్చలేదు..! కెప్టెన్‌ స్టేట్‌మెంట్‌తో విభేదించిన అజయ్ జడేజా.. ఎందుకు?


Also Read: Shami Latest News: పాక్‌ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్‌.. ఇవిగో సాక్ష్యాలూ..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి