IND vs ENG 5th Test:  వంద కోట్ల మంది భారతీయులు ఉత్కంఠంగా ఎదురు చూస్తోన్న ఐదో టెస్టుకు టీమ్‌ఇండియా రెడీ! కొవిడ్‌ కారణంగా గతేడాది వాయిదా పడిన ఆఖరి, ఐదో టెస్టు జులై 1న మొదలవుతోంది. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీసులో భారత్‌ 2-1తో పైచేయి సాధించింది. ఆఖరి పోరును డ్రా చేసుకున్న టీమ్‌ఇండియా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఆంగ్లేయులను ఇంగ్లాండ్‌ గడ్డపై ఓడించినట్టు అవుతుంది. సుదీర్ఘ ఫార్మాట్‌ తర్వాత రెండు జట్లు టీ20లు, వన్డేలు ఆడనుంది.


Also Read: ఎడ్జ్‌బాస్టన్‌కు రోహిత్‌ రెడీనా? రాహుల్‌ ద్రవిడ్‌ కామెంట్స్‌!!


Also Read: టీ20 సెంచరీ వెనక అసలు రీజన్‌ చెప్పిన దీపక్‌ హుడా!


భారత్‌ x ఇంగ్లాండ్‌ సిరీస్‌ వివరాలు



  • ఐదో టెస్టు: జులై 1న బర్మింగ్‌హామ్‌ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం

  • తొలి టీ20: జులై 7న సౌథాంప్టన్‌లోని రోజ్‌బౌల్‌లో గురువారం రాత్రి 10:30 గంటలకు ఆరంభం

  • రెండో టీ20: జులై 9న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు ఆరంభం

  • మూడో టీ20: జులై 10న నాటింగ్‌హామ్‌లో ఆదివారం రాత్రి 7 గంటలకు ఆరంభం

  • తొలి వన్డే : జులై 12న కెన్నింగ్‌టన్‌ ఓవల్‌లో మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు ఆరంభం

  • రెండో వన్డే: జులై 14న లార్డ్స్‌లో గురువారం సాయంత్రం 5:30 గంటలకు ఆరంభం

  • మూడో వన్డే: జులై 17న మాంచెస్టర్‌లో ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభం


భారత జట్టు: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, చెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రిషభ్‌ పంత్‌, శ్రీకర్‌ భరత్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ