ముంబయి టెస్టులో టీమ్‌ఇండియా భారీ స్కోరు వైపు దూసుకుపోతోంది. మూడోరోజు, ఆదివారం లంచ్‌ విరామానికి 2 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ (17 బ్యాటింగ్‌), విరాట్‌ కోహ్లీ (11 బ్యాటింగ్‌) నిలకడగా ఆడుతున్నారు. ఫలితంగా  ఆధిక్యం 405 పరుగులకు చేరింది. కివీస్‌కు 500+  లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది.


మయాంక్‌ అర్ధశతకం


ఓవర్‌నైట్ స్కోరు 69/0తో మూడోరోజు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. 38 పరుగులతో క్రీజులోకి వచ్చిన ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (62; 108 బంతుల్లో 9x4, 1x6) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌ అర్ధశతకం సాధించాడు. అతడికి తోడుగా 29 పరుగులతో బ్యాటింగ్‌ చేపట్టిన చెతేశ్వర్‌ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరినీ కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేలే ఔట్‌ చేయడం గమనార్హం. జట్టు స్కోరు 107 వద్ద మయాంక్‌, 115 వద్ద పుజారాను అతడు పెవిలియన్‌ పంపించాడు. కివీస్‌ బౌలర్లు అలసిపోయినట్టు కనిపిస్తున్నారు.






Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్‌.. కిర్రాక్‌! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్‌!


Also Read: PV Sindhu: వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరిన సింధు.. ప్రత్యర్థి ఎవరంటే?


Also Read: Ajaz Patel Record: 10 వికెట్ల ఫీట్.. ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే.. వారికి మాత్రమే సాధ్యమా?


Also Read: Ajaz Patel History: 10 వికెట్ల ఘనతను 2సార్లు ప్రత్యక్ష్యంగా చూసింది ఇద్దరే! ఒకరు ద్రవిడ్‌.. మరొకరు ఎవరంటే?


Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!


Also Read: IND vs NZ , Ajaz patel: అజాజ్‌ అదరహో..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన భారత సంతతి స్పిన్నర్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి