Viral News in Telugu: యమ ధర్మరాజు కర్ణాటకకు వచ్చాడు. అక్కడ ఓ రోడ్‌లను చూసి షాక్ అయ్యాడు. ఇవేం దారులురా బాబు అనుకున్నాడు. ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాలని రోడ్లపైన ఉన్న గుంటలపైన లాంగ్ జంప్ కాంపిటీషన్ పెట్టాడు. ఉడుపిలో జరిగింది ఇదంతా. యముడంటే నిజంగా యముడు కాదు లేండి. అలా వేషం వేసుకున్న వ్యక్తి ప్రభుత్వానికి ఇలా చురకలు అంటించాడు. గోతులున్న రోడ్లపైన ఇలాంటి విన్యాసాలు చేయించాడు. అస్థిపంజరం వేషం వేసుకున్న వ్యక్తిని ఆ గోతులపై నుంచి లాంగ్ జంప్ చేయించాడు. ఈ రోడ్డుపైన ప్రయాణం చేస్తే చివరికి ప్రాణాలు కోల్పోయి ఇలా అస్థిపంజరాలుగా మిగిలిపోతామని పరోక్షంగా సెటైర్లు వేశాడు. అంతే కాదు. ఎవరు ఎంత దూరం దూకుతున్నారో లెక్కలు కూడా రాసుకున్నాడు. యముడి పక్కనే చిత్రగుప్తుని వేషంలో మరో వ్యక్తి ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఈ లాంగ్‌ జంప్ కాంపిటీషన్ పెట్టారు. అధికారులను అలెర్ట్ చేసేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ దారిలో వెళ్లే వాళ్ల ఒళ్లు హూనం అవుతోందని, నరకం చూస్తున్నారని వివరించారు. (Also Read: Vehicle Discount: కొత్త కార్‌ కొనాలనుకునే వారికి గుడ్‌ న్యూస్, ఇలా చేస్తే భారీ డిస్కౌంట్ మీ సొంతం)






అంతకు ముందు హైదరాబాద్‌లో ఓ మహిళ ఇలాగే ఓ గోతిలో బురద నీళ్లలో కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. ఈ గోతిలో పడిపోవడం వల్లే తన పిల్లలకు గాయాలయ్యాయని, రోడ్‌ ట్యాక్స్ కడుతున్నా ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటున్నారని మండి పడింది. ఇప్పుడు ఏకంగా ఓ వ్యక్తి యముడి గెటప్‌లోనే వచ్చి అందరిలోనూ చైతన్యం నింపడంతో పాటు అధికారులనూ అలెర్ట్ చేశాడు. 


Also Read: Viral Video: షాకింగ్ వీడియో, చూస్తుండగానే క్షణాల్లో కుప్ప కూలిన వంతెన