Andhra Pradesh Politics - విశాఖ ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాల నిలిపివేత - కలెక్టర్ నుంచి నివేదిక కోరిన సీఎంవో
ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం కొనసాగడంపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. తక్షణం అక్కడ తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది. అక్కడ తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు.. ఎందుకు తవ్వుతున్నారన్న అంశంపై పూర్తి వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని విశాఖ కలెక్టర్ ను ఆదేశించింది. భీమిలి నియోజకవర్గంలో విస్తృతంగా ఉండే ఎర్రమట్టి దిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా భావిస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కువైట్‌లో మోసపోయిన సీమవాసికి విమక్తి - లోకేష్ చొరవతో ఇంటికి చేరుకున్న శివ
అది బెంగళూరు ఎయిర్ పోర్టు. డిపార్చర్స్ దగ్గర చాలా ఉద్వేగ సన్నివేశాలు ఉంటాయి. కానీ ఎరైవల్స్ దగ్గర కాస్త తక్కువే. కానీ బుధవారం ఉదయం ఎరైవల్స్ దగ్గర ఓ సన్నివేశం చాలా మందిని ఉద్వేగానికి గురి చేసింది.  గల్ఫ్ నుంచి వచ్చిన విమానంలో సాదాసీదా దుస్తులతో ఉన్న  వ్యక్తి దిగి టెర్మినల్ లోకి రాగానే అతని కుమర్తె ఏడుస్తూ వెళ్లి హత్తుకుంది. అతని భార్య కూడా అలాంటి భావోద్వేగంలోనే ఉన్నా.. అదిమి పట్టుకుంది. ఆనందాన్ని దాచుకుంది. ఆ వ్యక్తి పేరు శివన్న.  కువైట్‌లో ఉపాధి కోసం వెళ్లి ఏజెంట్ మోసానికి బలైన వ్యక్తి.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పారిశుద్ధ్య కార్మికులకు రోజా సైగలు- సెల్ఫీ కోసం వస్తే దూరం పెట్టారని నెటిజన్లు ఫైర్‌
కొందర్ని వివాదాలే వెతుక్కొని వెళ్తుంటాయి. మరికొందరు వివాదాల్నే వెతుక్కొని మరీ సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మాజీ మంత్రి రోజా మాత్రం మొదటి రకం. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ వివాదం చుట్టుముడుతుంది. వివాదాలు ఆమె చుట్టూ వైఫైలా తిరుగుతుంటాయి. ఇప్పుడు కూడా రోజా ఓ వివాదంలో చిక్కుకున్నారు. రోజా, సెల్వమణి దంపతులు ఇద్దరూ గుడిలో పూజలు చేసి వస్తున్న క్రమంలో సెల్ఫీలు ఇవ్వడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బింధువుగా మారింది.   పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కారణం కేటీఆరేనా ? అంతా ఆయనే చేస్తున్నారా ?
భారత రాష్ట్ర సమితి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులతో ఇబ్బంది పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచి బలంగా ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారో తెలియడం లేదు. ఇప్పటికే పది మంది పార్టీ మారిపోయారు. మరో పదిహేను మంది కూడా ఊగిసలాటలో ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ వీడిపోతున్నారంటే.. కాంగ్రెస్ ప్రలోభాలు అనే కారణం బీఆర్ఎస్ వైపు నుంచి వస్తుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేదువార్త, మూడు కీలక స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌లు ఇక ఆగవు!
తెలుగురాష్ట్రాలకు దక్షిణ మధ్య రైల్వే ఓ బ్యాడ్‌ న్యూస్ అందించింది. తిరుపతి, చెన్నై(Chennai), విశాఖ(Vishakha) మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు ఇది కచ్చితంగా చేదువార్తే. సికింద్రాబాద్ నుంచి చెన్నై, విశాఖ, తిరుపతి వెళ్లే చెన్నై ఎక్స్‌ప్రెస్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్ట్‌ ఎత్తివేస్తింది. విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు నల్గొండలో కూడా స్టాప్‌ ఎత్తివేశారు. ఈ నెల 19 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి