పంజాబ్‌లో 24 గంటల్లో జరిగిన మరొక మూకదాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కపుర్తలాలోని నిజాంపుర్​లో ఓ వ్యక్తి సిక్కుల జెండాను (నిషాన్​ సాహిబ్​) అగౌరవ పరిచి, పారిపోతుండగా దాడి చేసినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ దాడిలో గాయపడి ఆ వ్యక్తి మరణించాడు. స్థానికులు అతడిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.






24 గంటల్లో..


అమృత్​సర్​లోని స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేయబోయాడన్న కారణంతో ఓ వ్యక్తిని భక్తులు కొట్టి చంపిన 24 గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది.


స్వర్ణ మందిరంలోకి శనివారం ఓ ఆగంతుకుడు చొరబడ్డాడు. మందిరంలోని గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్వర్ణ మందిరం భద్రతా సిబ్బంది ఆగంతుకుడిని అడ్డుకున్నారు. గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న భక్తులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


ఆ వ్యక్తి ఎవరు?


శనివారం ఉదయం 11 గంటలకు ఆలయంలోకి వచ్చిన ఆగంతుకుడు అకాల్​ తఖ్త్​ ఎదుట కొన్ని గంటలు నిద్రించినట్లు పోలీసులు గుర్తించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుడు గురుగ్రంథ్​ సాహిబ్​ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించినట్లు వివరించారు. అతడి వద్ద ఫోన్​, పర్స్​, గుర్తింపు కార్డుల్లాంటివి ఏమీ లేవని వెల్లడించారు.


మరణించిన నిందితుడిపై ఐపీసీ సెక్షన్​ 295ఏ (ఉద్దేశపూర్వకంగా మతపర విశ్వాసాలను అవమానించడం, ఆగ్రహానికి గురిచేయడం) సహా 307(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు.


Also Read: Covid-19 Vaccination: ఆదర్శంగా అండమాన్ నికోబార్ దీవులు.. సవాళ్లను దాటి 100% వ్యాక్సినేషన్


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,081 మందికి కరోనా.. 143కు చేరిన ఒమిక్రాన్ కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి