'ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజనను' 2022 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద దేశంలోని పేదలకు ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాలను అందిస్తుందని కేంద్రం. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.






ఈ పథకం కింద దేశంలోని 80 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారు. కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఈ పథకం కింద అందిస్తుంది ప్రభుత్వం.  


కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల వలస కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వారికి మూడు నెలలపాటు ఆహార ధాన్యాలను అందించేందుకు 2020 ఏప్రిల్‌లో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే అప్పటి నుంచి ఈ పథకాన్ని కేంద్రం పొడిగిస్తూ వచ్చింది.







ఈ నిర్ణయం అమలుతో ప్రభుత్వంపై రూ.53,344.52 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.


Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'


Also Read: Primary Health Care: ఆ 13 రాష్ట్రాల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ.. జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!


Also Read: Farm Laws Repeal: వ్యవసాయ చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం.. తొలిరోజే సభకు!


Also Read: Whatsapp Message Delete: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్ డిలీట్ చేయాలా? అయితే ఇక బేఫికర్!


Also Read: Corona Cases: దేశంలో 537 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్


Also Read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి


Also Read: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి