18వ ఏషియన్-ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అక్టోబర్ 28న జరగను.న్న ఈ సదస్సుకు మోదీ వర్చువల్‌గా హాజరవుతారు. బ్రునై సుల్తాన్ ఈ మేరకు మోదీకి ఆహ్వానం పలికారు. ఆసియా దేశాలకు చెందిన దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. 


ఆసియా- భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం సహా కొవిడ్ 19, ఆరోగ్యం, వాణిజ్యం, సంబంధాలు, విద్య, సాంస్కృతిక రంగాల్లో పురోగతిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పీఎంఓ ప్రకటించింది. ప్రాంతీయ పరిస్థితుల నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు వెల్లడించింది.


ఈ ఏషియన్-ఇండియా సదస్సు మోదీ హాజరయ్యే తొమ్మిదో సదస్సు కానుంది. ప్రతి ఏడాది ఈ సదస్సు జరుగుతుంది. 


ఆసియా- భారత్ సంబంధాలకు 2022కు 30 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుత సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.


తూర్పు ఆసియా సదస్సు..


ఏషియన్- ఇండియా సదస్సుతో పాటు ఈ నెల అక్టోబర్ 27న జరగనున్న తూర్పు ఆసియా సదస్సులో కూడా మోదీ వర్చువల్‌గా పాల్గొంటారు. 2005 నుంచి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. 10 ఆసియా సభ్య దేశాలతో పాటు భారత్, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా కూడా ఇందులో సభ్యులుగా ఉన్నాయి.


Also Read: Sudan Protest: సూడాన్‌లో సైనిక తిరుగుబాటు.. ప్రధాని సహా పలువురు అరెస్ట్!


Also Read: Amit Shah CRPF camp Visit: ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మోదీ సర్కార్ సహించదు: అమిత్ షా


Also Read: Mumbai Cruise Drug Case: డ్రగ్స్ కేసులో కీలక అప్‌డేట్.. సాక్షి గోసవీ సరెండర్!


Also Read: PM Modi: 'గత ప్రభుత్వాలు లాకర్లు నింపుకున్నాయి.. మేం పేదల కడుపులు నింపుతున్నాం'


Also Read: Mumbai News: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. వాంఖడేపై విజిలెన్స్ విచారణ!


Also Read: UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ


Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?


Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి