Mann Ki Baat: వ్యాక్సినేషన్‌తో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాం: మోదీ

ABP Desam Updated at: 24 Oct 2021 01:17 PM (IST)
Edited By: Murali Krishna

ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో వ్యాక్సినేషన్‌ ద్వారా తెలిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాం: మోదీ

NEXT PREV

వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల మైలురాయిని చేరుకొని భారత్ ప్రపంచానికి తన సత్తా చాటిందని ప్రధాని నరేంద్ర మోదీ.. మన్‌ కీ బాత్‌లో అన్నారు. మన శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి చాటిచెప్పామని కొనియాడారు.







వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న భారత్ కొత్త శక్తితో ముందుకు సాగుతోంది. ఈ విజయం భారత్ సత్తాను ప్రపంచానికి చాటింది. మన దేశ ప్రజల శక్తిసామర్థ్యాల గురించి నాకు తెలుసు. దేశ ప్రజలకు వ్యాక్సినే వేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు పడుతోన్న శ్రమ ఎనలేనిది.                         -      ప్రధాని నరేంద్ర మోదీ






అక్టోబర్ 31న జరగనున్న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు మోదీ. సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్‌ను కీర్తించారు. ప్రపంచ శాంతి కోసం భారత్ విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఐరాస శాంతి పరిరక్షక దళాలకు అందిస్తున్న సహకారాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. మెరుగైన జీవన విధానం కోసం యోగాను పాటించేలా భారత్ ప్రోత్సహిస్తోందన్నారు.


వోకల్​ ఫర్ లోకల్, మేడ్ ఇన్ ఇండియా నినాదాలతో భారత్ ముందుకు వెళ్తుందన్నారు. రానున్న పండుగల సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనాలని సూచించారు.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి


Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్‌ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!


Also Read: ఐపీఎల్‌ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్‌ యునైటెడ్‌' ఆసక్తి!


Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 24 Oct 2021 12:47 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.