COP26 Update: 'మీ అబద్ధాలు వినీవినీ విసిగిపోయాం..' మోదీ, బైడెన్ ముందే ధైర్యంగా బాలిక ప్రసంగం

ABP Desam Updated at: 03 Nov 2021 07:49 PM (IST)
Edited By: Murali Krishna

అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్‌26)లో భారత్‌కు చెందిన ఓ బాలిక చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటోంది.

'మీ అబద్ధాలు వినీవినీ విసిగిపోయాం..' మోదీ, బైడెన్ ముందే ధైర్యంగా బాలిక ప్రసంగం

NEXT PREV

భారత్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక గ్లాస్గో వేదికగా జరిగిన అంతర్జాతీయ వాతావారణ సదస్సులో చేసిన ప్రసంగం యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ఆమె మాటలకు ఆ సదస్సు మొత్తం కరతాళధ్వనులతో దద్దరిల్లింది. ఆమె పేరు వినీశా ఉమాశంకర్.







ప్రపంచ నేతలపై ఈ రోజు మా తరం చాలా మంది విసుగ్గా ఉంది. మీపై కోపం తెచ్చుకునేందుకు చాలా కారణాలున్నాయి. కానీ మీపై కోప పడేంత సమయం మాకు లేదు. మేం పని చేసి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ పుడమితల్లి పుత్రికను. అందుకు నేను గర్విస్తున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది ఒకటే.. మాటలు వద్దు. చేతలు కావాలి. కాలుష్యంపై ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవద్దు. పాత పద్ధతులు ఇకనైనా ఆపేద్దాం. ఎందుకంటే నవతరం కోసం కొత్త దృక్పథం కావాలి. అందువల్ల మా వినూత్న సృజనలు, ఆవిష్కరణలపై మీ సమయాన్ని, డబ్బును వెచ్చించండి. మా బంగారు భవిత కోసం ప్రయత్నాలు చేయండి. మా భవిష్యత్తును మేం నిర్మించుకుంటాం. అందుకోసం దయచేసి మాతో చేతులు కలపండి.                                                - వినీశా ఉమాశంకర్


చిన్నప్పటి నుంచే..


తమిళనాడుకు చెందిన వినీశా ఉమాశంకర్‌.. చిన్నప్పటి నుంచి కాలుష్యం గురించి ఆలోచించేది. 12 ఏళ్ల వయసులోనే సౌరశక్తితో పనిచేసే ఐరనింగ్ బండిని రూపొందించింది. ఆ ఆవిష్కరణతో బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌ ప్రారంభించిన 'ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌' పోటీలకు వెళ్లి ఫైనల్‌ వరకు చేరింది. తాజాగా ప్రిన్స్‌ విలియమ్స్‌ ఆహ్వానం మేరకు కాప్‌26 సదస్సులో పాల్గొని 'క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌' అనే అంశంపై ప్రసంగించింది.


ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి ప్రపంచ నేతలు హాజరయ్యారు. ప్రపంచస్థాయి నేతలు, దేశాధినేతల ముందు ధైర్యంగా మాట్లాడిన వినీశా ప్రసంగాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.


Also Read: WHO on Covaxin: ఎట్టకేలకు 'కొవాగ్జిన్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం.. అత్యవసర వినియోగానికి ఓకే


Also Read: 100% Covid Vaccine: 'వ్యాక్సినేషన్‌లో అలసత్వం వహిస్తే.. మరో ముప్పు తప్పదు.. జాగ్రత్త'


Also Read: Vaccine for Children: చిన్నారుల వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం


Also Read: Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ వెయిటింగ్!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు


Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే


Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 03 Nov 2021 07:49 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.