100% Covid Vaccine: 'వ్యాక్సినేషన్‌లో అలసత్వం వహిస్తే.. మరో ముప్పు తప్పదు.. జాగ్రత్త'

ABP Desam Updated at: 03 Nov 2021 03:46 PM (IST)
Edited By: Murali Krishna

వ్యాక్సినేషన్‌లో వెనుకబడిన జిల్లా కలెక్టర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు.

వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ సూచనలు

NEXT PREV

వ్యాక్సినేషన్ కవరేజీ తక్కువగా ఉన్న 40 జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంచేశామని అజాగ్రత్త వహిస్తే మరో సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో ఝార్ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ సహా పలు రాష్ట్రాలకు చెందిన జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.






ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మోదీ మాట్లాడారు. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేసేందుకు పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా రాష్ట్రాలు 100 శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని లేకుంటే మరో కొత్త సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మోదీ అన్నారు.



వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారుల కృషి వల్లే వ్యాక్సినేషన్​లో దేశం ఈ స్థాయిలో పురోగతి సాధించింది. జిల్లా అధికారుల నుంచి ఆశావర్కర్ల వరకు ప్రతి ఒక్కరూ టీకా పంపిణీ కోసం పాటు పడ్డారు. కానీ ఈ సమయంలో అలసత్వం వహిస్తే మరో ముప్పు తప్పదు. వ్యాధులను, శత్రువులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చివరి వరకు మనం పోరాడాలి. కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. మీ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కవరేజీ పెంచేందుకు మీరు కూడా వినూత్న పద్ధతులను పాటించాలి.                                        - ప్రధాని నరేంద్ర మోదీ


ఇటీవలే ఇటలీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. జీ20 సహా వాతావరణ సదస్సులో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని దిల్లీ చేరుకున్న వెంటనే ఈ సమావేశం నిర్వహించారు. ఇటీవల భారత్ వ్యాక్సినేషన్‌లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది.


Also Read: Vaccine for Children: చిన్నారుల వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం


Also Read: Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ వెయిటింగ్!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు


Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే


Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 03 Nov 2021 03:46 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.