Budget 2024 LIVE Updates: ఉద్యోగులకు గుడ్ న్యూస్- స్టాండర్డ్‌ డిడక్షన్ పరిమితి రూ. 75వేలకు పెంపు

Union Budget 2024 LIVE Updates: మోదీ ప్రభుత్వం మూడోసారి ప్రవేశ పెడుతున్న బడ్జెట్‌పై భారీ అంచనాలున్నాయి. బడ్జెట్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ తెలుసుకునేందుకు ఈ లైవ్‌బ్లాగ్‌ని ఫాలో అవ్వండి.

ABP Desam Last Updated: 23 Jul 2024 07:23 PM
Union Budget 2024 LIVE Updates: 8 మంది బీజేపీ ఎంపీలున్నా, 8 రూపాయలు కూడా తేలేదు: కేటీఆర్

తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను ప్రజలు గెలిపించినా, కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రాష్ట్రానికి 8 రూపాయలు కూడా కేటాయించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మరోసారి రాష్ట్రానికి మొండిచేయి చూపించారని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Budget 2024 LIVE Updates: ఏ రూపంలో అయినా నిధులు నిధులే - ఏపీకి సూపర్ బడ్జెట్!

కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్,  బీహార్ రాష్ట్రాల గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలు కావడంతో.. ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారని మాట్లాడుకుంటున్నారు. బీహార్ గురించి పక్కన పెడితే ఈ కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమే అని అంటున్నారు. ఎన్నో  సమస్యల్లో ఉన్న ఏపీకి ఊపిరి పోసేలా నిధుల కేటాయింపు ఉందని వినిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Budget 2024 LIVE Updates: మహిళలకు వరాల జల్లు 

Budget 2024 LIVE Updates: మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లు మంజూరు చేశారు నిర్మలా సీతారామన్‌. ఈశాన్య ప్రాంతంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 100కు పైగా శాఖలు ఏర్పాటు చేయనున్నారు. దేశ ఆహార భద్రత కోసం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు. కేంద్ర బడ్జెట్ 2024-25 ఎంఎస్ఎంఈలు, కార్మిక ఆధారిత తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంఎస్ఎంఈలకు చేయూత ఇచ్చేందుకు ముద్ర రుణ పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు

Budget 2024 LIVE Updates: ఉద్యోగులకు గుడ్ న్యూస్ స్టాండర్డ్‌ డిడక్షన్ 75వేలకు పెంపు

Budget 2024 LIVE Updates: ఉద్యోగులకు గుడ్ న్యూస్ స్టాండర్డ్‌ డిడక్షన్ 75వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

Budget 2024 LIVE Updates: ఆదాయపు పన్నుపై కీలక ప్రకటన

Budget 2024 LIVE Updates: ఆదాయపు పన్నును సులభతరం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సకాలంలో టీడీఎస్ చెల్లించకపోవడం ఇకపై నేరం కాదన్నారు. 

Budget 2024 LIVE Updates: మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు చౌక

Budget 2024 LIVE Updates: బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి భారీ ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్ ఛార్జర్లు చౌకగా లభిస్తాయి. వీటితో పాటు విద్యుత్ వైర్‌లు, ఎక్స్ రే యంత్రాలు చౌకగా లభిస్తాయి. మూడు కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. 

Budget 2024 LIVE Updates: పట్టణాభివృద్ధిపై కేంద్రం దృష్టి 

Budget 2024 LIVE Updates: 100 పెద్ద నగరాలకు నీటి సరఫరా, మురుగునీటి శుద్ధికి ప్రాజెక్టులు ప్రకటించింది. 30 లక్షలకు పైగా జనాభా ఉన్న 14 పెద్ద నగరాల్లో అభివృద్ధి పథకాలు ప్రారంభించనున్నారు. పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద కోటి ప్రయోజనం చేకూరేలా ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన నగరాల్లో 100 వీక్లీ హాట్స్, స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. 

Budget 2024 LIVE Updates: బడ్జెట్లో యువతకు భారీ వరాలు ప్రకటించిన నిర్మలమ్మ 

Budget 2024 LIVE Updates:మొదటిసారి ఉద్యోగం చేసేవారికి ప్రభుత్వం రెండేళ్ల పాటు నెలకు రూ.3000 చొప్పున అదనపు పీఎఫ్ ఇవ్వనుంది.
- దేశీయ సంస్థల్లో చదువుకోవడానికి రూ.10 లక్షల వరకు అన్ సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ లభిస్తుంది.
- యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. 30 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఇందుకోసం బడ్జెట్ లో రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.
- 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు పథకాలను తీసుకురానుంది. రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
వచ్చే ఐదేళ్లలో కోటి మంది యువతకు ప్రభుత్వం ఇంటర్న్ షిప్ ఇవ్వనుంది. ఏడాది ఇంటర్న్షిప్లో ప్రతి నెలా రూ.5000 వేల ఆర్థిక సాయం అందిస్తారు.

Budget 2024 LIVE Updates: మొదటి సారి ఉద్యోగంలో చేరిన వారికి గుడ్ న్యూస్ 

Budget 2024 LIVE Updates: లక్ష రూపాయల కంటే తక్కువ జీతంతో తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం ప్రభుత్వం. అలాంటి వారికి పీఎఫ్‌లో మొదటి నెల జీతం వేయనుంది కేంద్రం. 

Budget 2024 LIVE Updates: ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల రుణం

దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం మరిన్ని కొత్త పథకాలతోపాటు 10 వేల బయోఫ్యూయల్ ప్లాంట్ల ఏర్పాటు, ఉపాధి, నైపుణ్యాల కోసం 3 పథకాలు తీసుకురానుంది. . 

Budget 2024 LIVE Updates: బడ్జెట్లో బిహార్, ఆంధ్రాపై ఫోకస్ 

Budget 2024 LIVE Updates: బిహార్‌లో రోడ్డు ప్రాజెక్టుల కోసం 26 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. బిహార్లో రూ.21 వేల కోట్లతో పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు బిహార్‌కు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 15 వేల కోట్ల ప్యాకేజీతోపాటు మరికొన్ని వరాలు ప్రకటించారు. 

Budget 2024 LIVE Updates: ఉచిత రేషన్ విధానం కొనసాగింపు 

Budget 2024 LIVE Updates: కరోనా నుంచి ఇస్తున్న ఉచిత రేషన్ విధానం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీంతోపాటు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఈ ఏడాది రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. ఉపాధి కోసం ప్రభుత్వం 3 ప్రధాన పథకాలను అమలు చేయనుంది కేంద్రం. బిహార్‌లో 3 ఎక్స్ ప్రెస్ హైవేలు ప్రకటించారు.  
-బోద్ధ గయ-వైశాలి ఎక్స్‌ప్రెస్‌ వే 
- పాట్నా-పూర్ణియా ఎక్స్‌ప్రెస్‌ వే .
- బక్సర్‌లో గంగా నదిపై డబుల్‌ రోడ్డు వంతెన
- బిహార్‌లో ఎక్స్‌ప్రెస్‌వేకు రూ.26,000 కోట్లు కేటాయించారు.
- విద్యార్థులకు రూ.7.5 లక్షల స్కిల్ మోడల్ లోన్ ఇవ్వనున్నారు. 
- మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి అదనపు పీఎఫ్ ఇస్తారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం

Budget 2024 LIVE Updates: యువత కోసం 5 కొత్త పథకాలు

Budget 2024 LIVE Updates: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 5 సంవత్సరాల్లో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాల్లో అభివృద్ధి చేసేలా 5 పథకాలు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ప్రధాన మంత్రి పేరుతో ప్యాకేజీ రూపంలో ప్రకటించారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించారు. 

Budget 2024 LIVE Updates: అమరావతి ప్రత్యేక ఆర్థిక చేయూత- 15 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం  

Budget 2024 LIVE Updates: ఏపీ విభజనపై కేంద్రం ఫోకస్ చేసిందన్న ఆర్థికమంత్రి అమరావతికి 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టుప్రకటించారు. 

Budget 2024 LIVE Updates: మధ్యంతర బడ్జెట్ హైలైట్స్‌ను ప్రస్తావించిన సీతారామన్

Budget 2024 LIVE Updates: మధ్యంతర బడ్జెట్‌లో చెప్పిన పేదలు, మహిళలు, యువత, రైతు అనే నాలుగు విభిన్న వర్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతుల కోసం ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు పెంచామన్నారు. ఖర్చులపై కనీసం 50% మార్జిన్ ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చామని వెల్లడించారు. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను 5 సంవత్సరాలకు పొడిగించారు. ఇది 80 కోట్లకు పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. 

Budget 2024 LIVE Updates: ప్రకృతి వ్యవసాయాన్ని పెంచడంపై ఫోకస్ 

Budget 2024 LIVE Updates: ఈ బడ్జెట్ అందరి అభివృద్ధి కోసమేనన్నారు నిర్మలా సీతారాన్. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం రోడ్ మ్యాప్ అని పేర్కొన్నారు. ఇంధన భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. ఉపాధి పెంపుపై ప్రభుత్వం దృష్టి ఉపాధిని పెంచడం ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలి అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించారు. 

Budget 2024 LIVE Updates: ఆర్థిక వృద్ధి వేగంగా జరుగుతోంది: నిర్మలా సీతారామన్

Budget 2024 LIVE Updates: భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందుతోందన్నారు నిర్మలా సీతారామన్. భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్న నిర్మలా ప్రధానంగా నాలుగు రంగాలను టార్గెట్‌చేసుకొని తమ పాలన ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఉపాధి, నైపుణ్యాలపై ఎక్కువ దృష్టి పెట్టామని పేర్కొన్నారు. 

Budget 2024 LIVE Updates: ద్రవ్యోల్బణం  తగ్గుతోంది: ఆర్థిక మంత్రి 

Budget 2024 LIVE Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ నాలుగు ప్రధాన రంగాలను వివరించారు. మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వారి ఆశలను అంచనాలను వమ్ము చేయకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. భారత్‌లో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ వస్తోందని అన్నారు. ప్రపంచంలో ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా తగ్గించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Budget 2024 LIVE Updates: ఈ నాలుగు వర్గాలపైన ఫోకస్ 

Budget 2024 LIVE Updates: మధ్యంతర బడ్జెట్‌లో చెప్పినట్టుగానే పేదలు, మహిళలు, యువత, అన్నదాతకు తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి ఆర్థికమంత్రి వివరించారు. 

Budget 2024 LIVE Updates: మా విధానాలపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు : నిర్మలా సీతారామన్ 

Budget 2024 LIVE Updates: మూడోసారి తమను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. తమ పాలసీలపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Budget 2024 LIVE Updates: నిర్మలా సీతారామన్‌పై  రైతుల భారీ ఆశలు

Budget 2024 LIVE Updates: రైతులు కూడా బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకొని ఉన్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో ఈసారి రైతులకు ఎంతో కొంత మేలు చేస్తారని భావిస్తున్నారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ బడ్జెట్‌లో కిసాన్ క్రెడిట్ కార్డుపై రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది. వీటితోపాటు నేషనల్ ఆయిల్ సీడ్ మిషన్, ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకానికి నిధులను కూడా విస్తరించవచ్చు.

Budget 2024 LIVE Updates: గంపెడాశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలు 

Budget 2024 LIVE Updates: బడ్జెట్‌ 2024-25లో కచ్చితంగా భారీగా నిధులు కేటాయింపుతోపాటు కీలకమైన ప్రాజెక్టులు కూడా ఇస్తారని తెలుగు రాష్ట్రాలు ఆశతో ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు పలు మార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితోసహా కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. మరీ ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు వివరించారు.

Budget 2024 LIVE Updates:మోడీ 3.0కు రోడ్డు మ్యాప్‌లా బడ్జెట్‌ 2024-25

Budget 2024 LIVE Updates: మోడీ 3.0కు ఐదేళ్ల రోడ్ మ్యాప్‌లా ఈ బడ్జెట్ ఉంటుందని విశ్లేషకులు బావిస్తున్నారు. అభివృద్ధి చెందిన భారత్ వ్యూహాన్ని కూడా ఇది వెల్లడిస్తుందంటున్నారు. ఉపాధి పెంపునకు కొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు. గ్రీన్ ఎకానమీకి పెద్దపీట వేయవచ్చు.

Budget 2024 LIVE Updates: బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

Budget 2024 LIVE Updates: బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది. కాసేపటి క్రితం పార్లమెంట్ హాల్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రిమండలి బడ్జెట్‌ 2024-25కు ఆమోద ముద్రవేసింది. 

Budget 2024 LIVE Updates: మంత్రివర్గంలో పాల్గొనేందుకు పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ 

Budget 2024 LIVE Updates: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంటుకు చేరుకున్నారు. కేంద్ర కేబినెట్ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్ హౌస్ కు చేరుకున్నారు.

Budget 2024 LIVE Updates: బడ్జెట్‌ ఆమోదానికి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ

Budget 2024 LIVE Updates: బడ్జెట్ ప్రతులు పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్నాయి. క్యాబినెట్ మంత్రులు కూడా పార్లమెంట్‌కు చేరుకున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్‌కు వచ్చారు. 10.15 క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రపతి ఆమోదించిన బడ్జెట్‌ను క్యాబినెట్ ముందు ఉంచబోతున్నారు నిర్మలా సీతారామన్. అనంతరం కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

Budget 2024 LIVE Updates: బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ఆమోదం కోరిన సీతారామన్

Budget 2024 LIVE Updates:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. 2024-25 బడ్జెట్ కాపీని ముర్ముకు అందజేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రి ఆమోదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు రాష్ట్రపతి ముర్ము పెరుగు, పంచదార తినిపించారు.

Budget 2024 LIVE Updates: ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకున్న నిర్మలా సీతారామన్

Budget 2024 LIVE Updates:ఇవాళ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకున్నారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. బడ్జెట్ 2024-25 కాపీని రాష్ట్రపతికి అందజేయనున్నారు.

Budget 2024 LIVE Updates: ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకున్న నిర్మలా సీతారామన్

ఇవాళ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకున్నారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. బడ్జెట్ 2024-25 కాపీని రాష్ట్రపతికి అందజేయనున్నారు.

Budget 2024 LIVE Updates:నిర్మలా సీతారామన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు 

Budget 2024 LIVE Updates: మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌  ప్రవేశ పెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 11 గంటలకు బడ్జెట్‌ను  ప్రవేశపెట్టనున్నారు. 

Budget 2024 LIVE Updates: యూనియన్ బడ్జెట్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నారా?

Budget 2024 LIVE Updates: అన్ని వర్గాల ఆశలు పద్దు మరికాసేపట్లో పార్లమెంట్‌ ముందుకు రానుంది. తన ఏడో బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ప్రభుత్వ అధికారిక యాప్ యూనియన్ బడ్జెట్ యాప్‌లో పొందవచ్చు. దీనిలో బడ్జెట్ కు సంబంధించిన మొత్తం సమాచారం పిడిఎఫ్ ఫార్మాట్‌లో లభిస్తుంది. వీటితో పాటు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. మొత్తం సమాచారం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. 

Budget 2024 LIVE Updates: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు భారీగా నిధులు పెంచే అవకాశం

కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించింది. ఇప్పుడు లక్షలాది మంది భారతీయ పౌరులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకంతో ఆర్థికంగా ప్రయోజనం పొందడమే కాకుండా వ్యాపారాం చేసేందుకు ప్రభుత్వం సహాయపడుతుంది. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తోంది. 2024-25 బడ్జెట్‌లో దీనికి ఈసారి నిధులు భారీగా పెంచే అవకాశం ఉంది. 

Budget 2024 LIVE Updates: బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు పలు ఉపశమనాలను ప్రకటించే అవకాశం

Budget 2024 LIVE Updates: మోడీ ప్రభుత్వం మూడో టర్మ్ ప్రవేశపెట్టనున్న మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు పలు ఉపశమనాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి ఆదాయపు పన్ను శ్లాబ్‌ను ప్రభుత్వం మార్చే అవకాశం ఉంది. 30 శాతంగా ఉన్న టాప్ స్లాబ్‌ను 25 శాతానికి తగ్గించవచ్చని అంచనా. పన్ను చెల్లింపుదారులకు, బడ్జెట్ తర్వాత టిడిఎస్ తగ్గింపు తగ్గించవచ్చు. వేతన పన్ను చెల్లింపుదారులకు 80సీ కింద మినహాయింపు పరిధిని ఆర్థిక మంత్రి పెంచవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ను రూ.60 వేల నుంచి రూ.లక్షకు పెంచుకోవచ్చు. ఎన్పీఎస్, హెచ్ఆర్ఏ తదితరాలపై మినహాయింపుల పరిధి ఈసారి పెరిగే అవకాశం ఉంది. కొత్త పన్ను విధానంలో అన్ని మార్పులు చేయనున్నారు. 

Background

Budget 2024 LIVE Updates: మోదీ ప్రభుత్వం మూడోసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ పద్దుని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. మూడోసారి అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పుడు పూర్తిస్థాయిలో బడ్జెట్‌ని వెల్లడించనున్నారు. అయితే..ఈ పద్దుపై ఉద్యోగులతో పాటు మధ్యతరగతి ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను శ్లాబులపై ఏమైనా ఆసక్తికర ప్రకటనలు చేస్తారా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయాలుతీసుకోనుందో అన్నదీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 2023-24కి సంబంధించిన ఎకనామిక్ సర్వేని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి GDP 6.5% నుంచి 7% వరకూ ఉంటుందని అంచనా వేశారు. ఈ అంచనాలకు అనుగుణంగానే కేంద్రం కేటాయింపులు చేయనుంది. 


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడో బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మోదీ 3.0 తొలి బడ్జెట్ ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సబలో  ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఇది. ఆర్థిక మంత్రి సీతారామన్ నాయకత్వంలో వరుసగా పెట్టే ఏడో బడ్జెట్ ఇది.


బడ్జెట్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు indiabudget.gov.inలో లభిస్తాయి. దూరదర్శన్, సంసద్ టీవీ, వివిధ అధికారిక ప్రభుత్వ యూట్యూబ్ ఛానళ్లలో బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు బద్దలు కొట్టనున్నారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు ఇప్పటికీ దేశాయ్ పేరిట ఉంది. వచ్చే నెలలో 65వ వసంతంలోకి అడుగుపెడుతున్న నిర్మలా సీతారామన్ ఈ ఘనత సాధించనున్నారు. 


రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్
2019లో భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆమెను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ సహా వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి (2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు) పూర్తి బడ్జెట్ వరుసగా ఏడో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 1959 నుంచి 1964 వరకు వరుసగా 5 పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన దేశాయ్ రికార్డును ఆమె అధిగమించనున్నారు.


బడ్జెట్ పై ప్రజల ఆకాంక్షలు ఏమిటి?
కొత్త పెన్షన్ విధానం, ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక భద్రతా పథకాలపై సాధారణ బడ్జెట్‌లో ప్రకటనలు చేయవచ్చని అంచనా ఉంది. ఆదాయపు పన్ను విషయంలో ఉపశమనం లభిస్తుందనే ఆశలు ఉద్యోగుల్లో లేవు. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం, గ్రామీణ, వ్యవసాయ కేటాయింపులు పెంచడం, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.


లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ... 70 ఏళ్లు పైబడిన పౌరులందరినీ ఆయుష్మాన్ పథకం పరిధిలోకి తీసుకువస్తామని, రూ .5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందని చెప్పారు. పెట్టుబడుల ద్వారా గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు, ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు. దానికి అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందని చెబుతున్నారు. 


బడ్జెట్ పై మూడీస్ అనాలసిస్‌


పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌లో మూలధన వ్యయం పెరగవచ్చని మూడీస్ తెలిపింది. 
లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుందని మూడీస్ అనలిటిక్స్ ఆర్థికవేత్త అదితి రామన్ సోమవారం అన్నారు. మధ్యంతర బడ్జెట్‌లో పన్ను రేట్లు అలానే ఉంచారని, అయితే లోటు పెరగకుండా ఉండేందుకు పన్నులతోపాటు ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వ వ్యయం పెరగాల్సి ఉందన్నారు.


ఈ బడ్జెట్ వ్యాపారం, వినియోగదారుల విశ్వాసంపై ప్రభావం చూపుతుందని మూడీస్ అనలిటిక్స్ తెలిపింది. మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలపై మూలధన వ్యయానికి నిధులు ఖర్చు చేయనున్నారు. పన్నుల విషయంలో మరింత ప్రామాణిక విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని, అయితే విధానాల కొనసాగింపుపై ఎక్కువ దృష్టి సారిస్తామని చెప్పింది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.