Bipin Rawat Demise: 'బిపిన్ రావత్ చివరి సందేశం ఇదే.. ఆ మాటల్లో కూడా దేశం గురించే'

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 12 Dec 2021 05:37 PM (IST)

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్.. చివరి సందేశాన్ని సైన్యం విడుదల చేసింది. ఆ వీడియోలో ఆయన ఏమన్నారో మీరే వినండి.

బిపిన్ రావత్ చివరి సందేశం

NEXT PREV

భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం విడుదల చేసింది. 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా దిల్లీలో ఈరోజు నిర్వహించిన 'స్వర్ణిమ్​ విజయ్‌ పర్వ్​' కార్యక్రమంలో బిపిన్ రావత్​ చివరి వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు. 1971 ఇండియా-పాక్‌ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద జరిగింది.

Continues below advertisement






డిసెంబరు 7న రికార్డు చేసిన ఈ వీడియోలో ఆ యుద్ధంలో అమరులైన సైనికులకు రావత్ నివాళులు అర్పించారు. 



స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా మన వీర జవాన్లకు శుభాకాంక్షలు. 1971లో పాకిస్థాన్‌పై భారత్ గెలిచిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యుద్ధంలో అమరులైన భారత వీర జవాన్లను మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం.                                                  - బిపిన్ రావత్, భారత తొలి సీడీఎస్


ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సహా పలువురు ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. బిపిన్ రావత్ అకాల మరణం వల్ల ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా చేస్తున్నట్లు రాజ్​నాథ్​ పేర్కొన్నారు.



1971 ఇండో-పాక్​ యుద్ధంలో అమరులైన ప్రతి భారత సైనికుడి ధైర్యానికి, పరాక్రమానికి, త్యాగానికి నా నమస్కారాలు. ఆ ధైర్యవంతులందరి త్యాగానికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఈ యుద్ధం మన నైతికతకు, మన పరాక్రమానికి నిదర్శనం. యుద్ధంలో పాకిస్థాన్‌ను ఓడించినప్పటికీ వారిపై మనం ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. ఆ అధికారాన్ని వారికే అప్పగించాం. ఇది చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తుంది.                                     - రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​


Also Read: Omicron Cases In India: దేశంలో 36కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఆంధ్రప్రదేశ్, ఛండీగఢ్‌లో తొలి కేసు నమోదు


Also Read: US Tornado: టోర్నడో ధాటికి అమెరికా కకావికలం.. 80 మంది వరకు మృతి


Also Read: Viral Video India 2021: 'ఏం చేస్తిరి ఏం చేస్తిరి.. దుమ్మురేపారు కదరా'.. ఈ ఏడాది ఇవే తోపు వీడియోలు!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,774 మందికి కరోనా.. 560 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి


Also Read: తిండి విషయంలో ఈ చెడు అలవాట్లు మీకున్నాయా? వెంటనే వదిలేయండి


Also Read:  విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే


Also Read: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!


Also Read: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 12 Dec 2021 05:36 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.