Bharat Jodo Yatra: 'ఎందుకీ బ్రహ్మచర్యం, పెళ్లి చేసుకోండి అమ్మాయిని చూస్తాం'- సిగ్గుపడిన రాహుల్!

ABP Desam Updated at: 11 Sep 2022 01:05 PM (IST)
Edited By: Murali Krishna

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసిన కొంత మంది మహిళలు ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు.

(Image Source: Twitter/@Jairam_Ramesh)

NEXT PREV

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర చేస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. తమిళనాడులో కొంతమంది మహిళలు.. రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని, మంచి అమ్మాయిని చూస్తామని ప్రపోజ్ చేశారు. ఇందుకు రాహుల్ గాంధీ నవ్వుతూ సిగ్గుపడ్డారు.


తమిళ అమ్మాయి


మూడో రోజు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు కన్యాకుమారిలోని మార్తాండం చేరుకున్నారు. ఇక్కడ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం మహిళా కార్యకర్తలు ఆయనతో మాట్లాడారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావనవచ్చింది.



రాహుల్ గాంధీ.. మీకు తమిళనాడు అంటే ఎంత ప్రేమో మాకు తెలుసు. అందుకే మీకు ఓ మంచి తమిళ అమ్మాయిని చూసి పెడతాం. పెళ్లి చేసుకోండి. ఎందుకీ బ్రహ్మచర్యం.                                                                - మహిళ


ఇది విన్న రాహుల్ గాంధీ వెంటనే నవ్వారు. ఏం సమాధానం చెప్పకుండా సిగ్గుపడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.







భారత్ జోడో యాత్రలో ఇది వినోదాత్మకమైన క్షణం. పెళ్లి ప్రస్తావన రాగానే రాహుల్ గాంధీ ఎలా నవ్వుతున్నారో చూడండి.                                                      -  జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత


జోడో యాత్ర


మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.


కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ముకశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేయనున్నారు.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 5 వేల కరోనా కేసులు- ఏడుగురు మృతి


Also Read: Uttar Pradesh: ఇదేం భక్తిరా నాయనా- నాలుక కోసుకొని అమ్మవారికి సమర్పణ!

Published at: 11 Sep 2022 12:52 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.