Corona Cases: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 5,076 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనాతో మృతి చెందారు. తాజాగా 7,227 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది.


మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 







  • యాక్టివ్ కేసులు: 47945

  • మొత్తం రికవరీలు: 43919264

  • మొత్తం మరణాలు: 528150

  • మొత్తం వ్యాక్సినేషన్: 2,14,95,36,744


వ్యాక్సినేషన్







దేశంలో కొత్తగా 17,81,723 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 214.95 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,20,784 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.


గ్రీన్ సిగ్నల్


భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్​ టీకా (బీబీవి154/నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్​ మాండవీయ మంగళవారం తెలిపారు.



కరోనాపై యుద్ధంలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్​ టీకా (బీబీవి154/నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన వారికి అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకా ఇవ్వొచ్చు.                                           "
-మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి


ఒక్కసారి చాలు


భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఒక్కసారి తీసుకుంటే చాలని నిపుణులు అంటున్నారు. ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌‌ను 'BBV154'గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నాసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికే సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.


Also Read: Uttar Pradesh: ఇదేం భక్తిరా నాయనా- నాలుక కోసుకొని అమ్మవారికి సమర్పణ!


Also Read: Krishnam Raju Death News: కృష్ణంరాజు మరణంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి