Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 09 Dec 2023 10:32 PM
యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

చిన్నజీయర్ స్వామి సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ కు వెళ్లారు. తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. కేటీఆర్ ను, వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్యం వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

శనివారం మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం కొన్ని అనివార్య కారణాల రీత్యా హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని నేరుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు.

హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

శనివారం మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం కొన్ని అనివార్య కారణాల రీత్యా హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని నేరుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు.

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్నారు.  

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణలో మూడోసారి కొలువు దీరిన ప్రభుత్వ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ సమావేశాలు ప్రారంభించారు. 

మంత్రులకు శాఖల కేటాయింపు

తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయ శాఖ 


జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్‌ శాఖ 


కొండా సురేఖ- అటవీ శాఖ 


శ్రీధర్‌ బాబు- ఐటీ, ఇండస్ట్రీ, శాసనభ వ్యవహారాల శాఖ 


దామోదర్ రాజనర్సింహ- ఆరోగ్య శాఖ 


పొన్నం ప్రభాకర్- రవాణా శాఖ 


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- సమాచార శాఖ 

మంత్రులకు శాఖలు కేటాయించిన రేవంత్ రెడ్డి

మంత్రులకు శాఖలు కేటాయింపు 
భట్టి విక్రమార్క- ఫైనాన్స్‌
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - సివిల్‌ సప్లై, ఇరిగేషన్ 


కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి- ఆర్‌అండ్‌ బీ శాఖ


 

Background

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి సమావేశం కావడంతో రెగ్యులర్‌ స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఎన్నికల సభ్యుల్లో ఆయన సీనియర్ కావడంతో ఈ బాధ్యతలు అప్పగించారు. నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఆయనతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు హాజరు అయ్యారు. 


11 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అక్కడ అక్బరుద్దీన్‌ మిగతా ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. 11 గంటలకు సమావేశమయ్యే సభలో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. 


ఎమ్మెల్యేల ప్రమాణ తర్వాత శనివారం సాయంత్రం స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం స్పీకర్ ఎన్నికల ఉంటుంది. ఇప్పటికే స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రేవంత్ రెడ్డి సర్కారు ఎంపిక చేసింది. దీంతో ఆయన ఎన్నికల లాంఛనం కానుంది. 


బీజేపీ ఎమ్మెల్యే దూరం
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎంపిక చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో ప్రస్తుతం జరిగే ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. గతంలో కూదా రాజా సింగ్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. 2018లో ప్రొటెం స్పీకర్‌గా అప్పటి సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌ను నియమించారు. దీంతో రాజా సింగ్‌ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. తర్వాత ఆయనతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
కేసీఆర్‌ దూరం
తుంటి ఎముకకు గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ సమావేశాలకు దూరంగా ఉండబోతున్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలోని బాత్‌రూంలో జారి పడ్డారు. దీని కారణంగా తుంటి ఎముక విరిగింది. దీనికి శుక్రవారం రాత్రి చికిత్స చేశారు. దీంతో ఆయన సభకు హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయింది. 


మొదటి రోజు ఎమ్మెల్యే ప్రమాణం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మూడో రోజు గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. నాల్గో రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ ఉంటుంది. నాలుగు రోజుల సమావేశాలు కారణంగా శాసన సభ చుట్టూ భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం ఆరు గంటల నుంచే ఆంక్షలు మొదలయ్యాయి. 


అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ఎమ్మెల్యేలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందజేసిన సర్టిఫికేట్‌ ఒరిజినల్‌, రెండు జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది. వాటిని శాసనసభ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. దీంతోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వారి లైఫ్‌పార్టనర్‌కు చెందిన నాలుగు ఫొటోలు తీసుకురావాలి. వారి బయోడేటాను కూడా ఇవ్వాలి. వారికి ఎమ్మెల్యే విధివిధానాలు తెలిపే హ్యాండ్‌బుక్ ఇస్తారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.