ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు గడువు.. డిసెంబర్ 6వ తేదీ వరకు ఉంది. పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు హెచ్ పీసీఎల్ తెలిపింది. గ్రాడ్యుయేట్ అప్రంటీస్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. 


ఈ రిక్రూట్ మెంట్ లో ఎంపికైన అభ్యర్థులు మార్కెటింగ్  విభాగంలో పని చేయాలి. ఏడాది పాటు తాత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో తెలిపారు. నేషనల్ అప్రంటీస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అయితే అందులో అప్రూవల్ పొందిన వారు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలి. 
 
మొత్తం ఎన్ని ఖాళీలు అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇన్ స్ర్టూ మెంటేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ పూర్తి చేసిన వాళ్లే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో  ఉంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు. 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి నెలకు రూ. 25 వేల చొప్పను స్టైఫండ్ చెల్లిస్తారు. నవంబర్ 22న మెుదలైన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 6న ముగుస్తుంది.


Also Read: Job Alert: నెలకు 14 రోజులే పని ... రోజుకు రూ. 59 వేల జీతం... ఏం ఉద్యోగమో తెలుసా..!


Also Read: ఈ కోర్సులు నేర్చుకునే వారు భవిష్యత్ లో దూసుకుపోవచ్చు.. ఉద్యోగం మీకే ముందు వచ్చే ఛాన్స్


Also Read: National Employment Policy: వాట్ ఈజ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ.. త్వరలో నిపుణుల కమిటీ


Also Read: New Courses: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం